సీమాంధ్రలో ఓటర్లు శివమెత్తారు. కనీవినీ ఎరుగని రీతిలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కొన్ని జిల్లాలో ఎండలు, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు అడ్డంకులు సృష్టించినా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పారు సీమాంధ్ర ప్రజలు. మధ్యాహ్నం 3 గంటల సమయానికే సీమాంధ్రలో పోలింగ్ 63 శాతాన్ని దాటేసింది. సాయంత్రం 6 గంలకు పోలింగ్ ముగిసే సమయానికి ఇది 75 శాతం వరకూ చేరే సూచనలు కనిపిస్తున్నాయి. గుంటూరు, కడప జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య దాడులు మినహా మిగిలిన చోట్ల చాలావరకూ ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది.
7, మే 2014, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి