తన తమ్ముడికి గుణపాఠం చెప్పాలని కార్యకర్తలను కోరారు సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ. అయితే, ఈ మాటలు తన సొంత తమ్ముడు రాహుల్ గాంధీని ఉద్దేశించి మాత్రం కాదు.. పినతల్లి కొడుకైన వరుణ్ గాంధీ గురించి. అమేథీలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సుల్తాన్ పూర్ నుంచి పోటీ పడుతున్న వరుణ్ కు ఈ సారి గుణపాఠం చెప్పాల్సిందేనంటూ సూచించారామె. వరుణ్ పై ప్రియాంక నేరుగా దాడి చేయడం ఇదే తొలిసారి. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా వరుణ్ ను భావించాల్సిన అవసరం లేదన్నారామె. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగాలను సైతం చేసిందని, వరుణ్ కు సరైన మార్గం ఏదో చూపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ప్రియాంక. రాజకీయాలు ప్రజలకు కలిపి ఉంచడానికి దోహద పడాలే తప్ప.. విభజించకూడదని, ఈ విషయాన్ని వరుణ్ తెలుసుకోవాల్సి ఉందన్నారు ప్రియాంక గాంధీ. అమేథీలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడిన వీడియోలు మీడియాకు చిక్కాయి.
13, ఏప్రిల్ 2014, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి