తన వ్యక్తిగత జీవితంపై రాజకీయనేతలు చేస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తనకు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావంటే తనకెంతో అభిమానమన్న పవన్, తనపై ఆయన చేసిన కామెంట్లను ప్రస్తావించారు.."పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు బై.. ఇక రాజకీయాల గురించి ఏం చెబుతాడు.. మా రాహుల్ గాంధీ అయితే, ఒక్క పెళ్లి చేసుకోలేదు బై" అని వీహెచ్ అన్నారని, కానీ, రాహుల్ బ్రహ్మచారి అని మాత్రం చెప్పలేదన్న విషయాన్ని గుర్తు చేశారు పవన్. ఒక్క పెళ్లి చేసుకొని 30 మందితో తిరిగితే తప్పు కాదా అన్నారాయన. కాంగ్రెస్ లో అలాంటి మిత్రులు వీహెచ్ కు ఎంతోమంది ఉన్నారన్నాయన. తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తే, కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలన్నింటినీ బయటకు తీసుకురావాల్సి వస్తుందని, రాహుల్ వ్యక్తిగత జీవితాన్ని గురించి కూడా చెప్పాల్సి వస్తుందన్నారాయన. తన గురించి ఇతర పార్టీల నేతలు తెలుసుకోవాలంటే గూఢచారులు కావాలని, కానీ, తాను వారి గురించి తెలుసుకోవలంటే మాత్రం తనకు అభిమానబలం ఉందన్నారు పవన్. కుటుంబంలోనూ, ప్రేమికుల మధ్య ఎన్నో సమస్యలు వస్తాయని, బయటనుంచి చూసేవాళ్లకు అవన్నీ కనిపించవన్నారు కళ్యాణ్. వాటిని అలా చూసి విమర్శించడం కూడా అత్యాచారం చేయడం లాంటిదేనన్నారు. మహిళల గురించి మాట్లాడకూడదన్న సంస్కారం ఉండాలన్న పవన్, అలా విమర్శించేవారిని నిర్భయ చట్టం కింద బుక్ చేయాలని డిమాండ్ చేశారు. తనను విమర్శించాలనుకునేవారు, ముందు అద్దంలో చూసుకుని, తమకు ఆ స్థాయి ఉందా లేదా అని నిర్ధారించుకుని మాట్లాడాలని హితవు పలికారు.
14, మార్చి 2014, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి