పరిస్థితి అలానే కనిపిస్తోంది. అదిగో ఇదిగో విలీనం అంటూ సంకేతాలిచ్చిన కేసీఆర్, ఆ విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ తో భారీ చర్చలే సాగించారు. కుటుంబ సమేతంగా సోనియా ముందు పరేడ్ చేసి మరీ తన మనసులో మాట బయటపెట్టారు. ఇక ఎంతలేదు.. విలీనం అనుకుంటున్న సమయంలోనే రూటు మార్చి, రాజకీయాన్ని రసవత్తరంగా మార్చారు కేసీఆర్.
కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీన పంచాయతీపై సాగుతున్న ఉత్కంఠ మరో రెండు రోజుల్లో విడిపోయే అవకాశం ఉంది. మార్చి 3న జరిగే పార్టీ పొలిట్ బ్యూరో, శాసనసభా పక్ష, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో దీనిపై పార్టీ నేతలతో చర్చించనున్నారు కేసీఆర్. అయితే, ఇప్పటివరకైతే పార్టీ నేతలెవరికీ కాంగ్రెస్ లో విలీనం కావడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇంతకాలం కష్టపడి ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొని పార్టీని నిలబెట్టుకుని, ఫలితాలు సాధించే సమయంలో విలీనం చేయడం సరికాదంటున్నారు టీఆర్ఎస్ నేతలు. కావాలంటే పొత్తు పెట్టుకుని సరిపెడదామని, విలీనంతో టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా నష్టపోతారని కేసీఆర్ కు చెప్పుకుంటున్నారు. దీంతో, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠను కలిగిస్తోంది.
అయితే, రాజకీయ పార్టీని నిర్వహించడమన్నది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. 15 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్న కేసీఆర్ కు ఇది బాగా తెలుసు. ఇంతకాలం ఉద్యమ పార్టీగా చెప్పుకున్న టీఆర్ఎస్.. తెలంగాణ ఏర్పాటుతో పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారనుంది. ఉద్యమం కారణంగా ఇంతకాలం వచ్చిన విరాళాలు, నిధులు ఇకపై ఆ స్థాయిలో రాకపోవచ్చు. పైగా, ఎన్నికల అనంతరం అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ కు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ, అధికారాన్ని దక్కించుకోలేకపోతే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. దీనికి తోడు పార్టీలో ముగ్గురి మధ్య సాగుతున్న వారసత్వపోరు పార్టీకి ఇబ్బందిని కలిగించే పరిస్థితులూ ఉన్నాయి. దీంతో విలీనం చేయడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపైనే కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు జరిపిన కేసీఆర్, హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. విలీనం కన్నా పొత్తుకే ప్రాధాన్యం ఇచ్చి, ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుందామని కొంతమంది నేతలు ప్రతిపాదిస్తున్నారు. టీఆర్ఎస్ , కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే మెజార్టీ స్థానాలు ఆ కూటమికే దక్కే అవకాశాలున్నాయి. ఈ విషయంపైనే మూడో తేదీన టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో చర్చించనుంది.
పొత్తుకే సిద్ధమని కేసీఆర్ ప్రకటిస్తే మాత్రం, కాంగ్రెస్ కు అది ఆశాభంగమే. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకున్న హస్తం, టీఆర్ఎస్ విలీనంతో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. కానీ, పొత్తుతో పోటీకి వెళ్తే మాత్రం, ఆ తర్వాత అధికారాన్ని పూర్తిస్థాయిలో దక్కించుకోవడం అసంభవం. కచ్చితంగా టీఆర్ఎస్ నేతలు ముఖ్యపదవులనే కోరుకుంటారు. దీనికి కాంగ్రెస్ నేతలూ అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. దీంతో, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీన పంచాయతీపై సాగుతున్న ఉత్కంఠ మరో రెండు రోజుల్లో విడిపోయే అవకాశం ఉంది. మార్చి 3న జరిగే పార్టీ పొలిట్ బ్యూరో, శాసనసభా పక్ష, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో దీనిపై పార్టీ నేతలతో చర్చించనున్నారు కేసీఆర్. అయితే, ఇప్పటివరకైతే పార్టీ నేతలెవరికీ కాంగ్రెస్ లో విలీనం కావడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇంతకాలం కష్టపడి ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొని పార్టీని నిలబెట్టుకుని, ఫలితాలు సాధించే సమయంలో విలీనం చేయడం సరికాదంటున్నారు టీఆర్ఎస్ నేతలు. కావాలంటే పొత్తు పెట్టుకుని సరిపెడదామని, విలీనంతో టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా నష్టపోతారని కేసీఆర్ కు చెప్పుకుంటున్నారు. దీంతో, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠను కలిగిస్తోంది.
అయితే, రాజకీయ పార్టీని నిర్వహించడమన్నది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. 15 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్న కేసీఆర్ కు ఇది బాగా తెలుసు. ఇంతకాలం ఉద్యమ పార్టీగా చెప్పుకున్న టీఆర్ఎస్.. తెలంగాణ ఏర్పాటుతో పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారనుంది. ఉద్యమం కారణంగా ఇంతకాలం వచ్చిన విరాళాలు, నిధులు ఇకపై ఆ స్థాయిలో రాకపోవచ్చు. పైగా, ఎన్నికల అనంతరం అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ కు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ, అధికారాన్ని దక్కించుకోలేకపోతే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. దీనికి తోడు పార్టీలో ముగ్గురి మధ్య సాగుతున్న వారసత్వపోరు పార్టీకి ఇబ్బందిని కలిగించే పరిస్థితులూ ఉన్నాయి. దీంతో విలీనం చేయడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపైనే కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు జరిపిన కేసీఆర్, హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. విలీనం కన్నా పొత్తుకే ప్రాధాన్యం ఇచ్చి, ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుందామని కొంతమంది నేతలు ప్రతిపాదిస్తున్నారు. టీఆర్ఎస్ , కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే మెజార్టీ స్థానాలు ఆ కూటమికే దక్కే అవకాశాలున్నాయి. ఈ విషయంపైనే మూడో తేదీన టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో చర్చించనుంది.
పొత్తుకే సిద్ధమని కేసీఆర్ ప్రకటిస్తే మాత్రం, కాంగ్రెస్ కు అది ఆశాభంగమే. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకున్న హస్తం, టీఆర్ఎస్ విలీనంతో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. కానీ, పొత్తుతో పోటీకి వెళ్తే మాత్రం, ఆ తర్వాత అధికారాన్ని పూర్తిస్థాయిలో దక్కించుకోవడం అసంభవం. కచ్చితంగా టీఆర్ఎస్ నేతలు ముఖ్యపదవులనే కోరుకుంటారు. దీనికి కాంగ్రెస్ నేతలూ అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. దీంతో, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
కామెంట్ను పోస్ట్ చేయండి