చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నదమ్ములైనా ఈ మధ్య కాలంలో ఒకే వేదికపై కనిపించిన సంఘటనలు లేనే లేవు. వీరిద్దరి మధ్యా విబేధాలున్నాయంటూ చాలాకాలంగా అభిమానుల్లోనూ, ఫిల్మ్ నగర్లోనూ వదంతులు షికార్లు చేస్తున్నాయి. మీరు తప్ప నాకెవ్వరూ లేరంటూ అభిమానులనుద్దేశించి ఓ ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. వీరిద్దరినీ కలిసి చూడాలన్న అభిమానుల కోరిక ఎట్టకేలకు నెరవేరబోతోంది. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినీ అరంగేట్ర కార్యక్రమం దీనికి వేదికవుతోంది. రేపు ఉదయం (27-2-14) రామానాయుడు స్టూడియోలో ఈ కార్యక్రమం జరగనుంది. నాగబాబు కోసం వీరిద్దరూ రావడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలోనైనా ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకుంటారో లేక.. ఎడమొహం పెడమొహంగా ఉంటారోనన్న ఉత్కంఠ ఫ్యాన్స్ ను వెంటాడుతోంది.
26, ఫిబ్రవరి 2014, బుధవారం
ఒకే వేదిక ఎక్కుతున్న చిరు, పవన్
Categories :
chiranjeevi . cinema . entertainment . nagababu . pawan kalyan . tollywood . varun tej
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి