రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి కీలక ఘట్టం ముగిసిపోయింది. విజయం మాదంటే మాదంటున్నారు ఇరుప్రాంత నేతలు.. చర్చ ముగిసినందుకు తెలంగాణ వాదులది విజయం అనుకోవాలా.. లేక బిల్లును తిరస్కరించాలంటూ సీఎం ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గినందుకు సమైక్యవాదులు గెలిచారనుకోవాలా.. ఇదే ఇప్పుడు అందరినీ డైలమాలో పడేస్తోంది..
చివరిరోజు ఏమవుతుందో అన్న టెన్షన్ లో అంతా ఉండగానే, ప్రక్రియను ముగించేశారు స్పీకర్ నాదెండ్ల మనోహర్. విభజన బిల్లుకు ఓ లక్ష్యం, ఓ ఆశయం లేదంటూ, అసలది బిల్లే కాదంటూ.. దాన్ని తిరస్కరించి పంపాల్సిందేనంటూ సీఎం కిరణ్ నోటీస్ ఇచ్చినప్పటి నుంచి సభ సజావుగా సాగడం లేదు. కేవలం వాయిదాలకే పరిమితం అవుతోంది. బీఏసీల మీటింగులు ఎన్ని నిర్వహించినా, పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. సీఎం నోటీస్ తిరస్కరించాల్సిందేనంటూ తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించాల్సిందేనంటూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు శాసనసభలో ఆందోళనలకు దిగడంతో చర్చలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇక చివరి రోజు కూడా ఇవే సంఘటనలు సభలో పునరావృతమయ్యాయి. రెండుసార్లు సభ వాయిదా వేసి, మూడోసారి సమావేశ పరిచిన స్పీకర్.. అకస్మాత్తుగా చర్చా వివరాలను ప్రకటించి, ఇంతవరకూ రికార్డైన 86 మంది ప్రసంగాలలో పాటు ఎమ్మెల్యేలు ఇచ్చిన లిఖితపూర్వక సమాచారాన్ని, బిల్లుకు సూచించిన 9072 సవరణలను కలిపి రాష్ట్రపతికి పంపిస్తానని సభలో ప్రకటించారు. ఆ తర్వాత సీఎం ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ముందు ఓటింగ్ కు ఉంచారు. మూజువాణి ఓటింగ్ ను నిర్వహించి.. తీర్మానం నెగ్గిందని చెప్పి సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇక్కడే అసలు గొడవ మొదలయ్యింది.
రాష్ట్రపతి ఇచ్చిన గడువు ప్రకారం చర్చను ముగించేశారు స్పీకర్ నాదెండ్ల మనోహర్. సభ్యుల అభిప్రాయాలను రాష్ట్రపతికి పంపించనున్నారు. దీంతోపాటే, సభ బిల్లును తిరస్కరించాలని తీర్మానించిందంటూ రాష్ట్రపతికి పంపించనున్నారు. దీంతో బిల్లుపై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. అయితే, కేవలం అభిప్రాయాల కోసమే బిల్లును శాసనసభకు పంపించారు కాబట్టి, వాటినే రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకుంటారన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. అయితే, బిల్లును తిరస్కరిస్తూ సభ తీర్మానం చేసింది కాబట్టి, పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టకూడదని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. మూజువాణి ఓటంటే ఏకగ్రీవ నిర్ణయంతో సమానం కాబట్టి, సభంతా సమైక్యవాదానికే కట్టుబడి ఉందని గుర్తించాలన్నారు మంత్రి ఆనం.
సీఎం తీర్మానాన్ని సభలో నెగ్గించడం దుర్మార్గమంటూనే, చర్చ ముగిసినందుకు మాత్రం హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ నేతలు. తమకు కావాల్సింది అసెంబ్లీలో ప్రక్రియ ముగియడమేనంటున్నారు. ఢిల్లీ దిగ్విజయ్ సింగ్ చేసిన కామెంట్లూ దీనికి తగ్గట్లే ఉన్నాయి. సీఎం తీర్మానంపై మాత్రమే సభ ఓటింగ్ నిర్వహించిందని, బిల్లుపై కాదంటూ ఆయన ప్రకటించారు. పైగా, ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానికి సంక్రమించిన అధికారాలకు ఈ తీర్మానం ఏమాత్రం విఘాతం కలిగించదన్నారాయన. ఫిబ్రవరి 4న జీవోఎం సమావేశంలో అసెంబ్లీ పంపించిన అభిప్రాయాలపై చర్చించే అవకాశం ఉంది. సభ సూచించిన సవరణల్లో సహేతుకమైన వాటిని బిల్లులో పొందుపరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని భావిస్తున్న యూపీఏ సర్కార్కు బీజేపీ మద్దతు తప్పని సరి. అందుకే, బీజేపీ సూచిస్తున్న పోలవరానికి జాతీయ హోదా, పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో చేర్చడం, సీమాంధ్ర రాజధానికి నిర్ధిష్టమైన నిధుల కేటాయింపును ప్రకటించే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమైక్య తీర్మానం చేయగలిగిన సీమాంధ్ర నేతలు, ఇప్పుడు దృష్టంతా ఢిల్లీపై పెట్టారు. పార్లమెంట్లోనూ బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
చివరిరోజు ఏమవుతుందో అన్న టెన్షన్ లో అంతా ఉండగానే, ప్రక్రియను ముగించేశారు స్పీకర్ నాదెండ్ల మనోహర్. విభజన బిల్లుకు ఓ లక్ష్యం, ఓ ఆశయం లేదంటూ, అసలది బిల్లే కాదంటూ.. దాన్ని తిరస్కరించి పంపాల్సిందేనంటూ సీఎం కిరణ్ నోటీస్ ఇచ్చినప్పటి నుంచి సభ సజావుగా సాగడం లేదు. కేవలం వాయిదాలకే పరిమితం అవుతోంది. బీఏసీల మీటింగులు ఎన్ని నిర్వహించినా, పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. సీఎం నోటీస్ తిరస్కరించాల్సిందేనంటూ తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించాల్సిందేనంటూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు శాసనసభలో ఆందోళనలకు దిగడంతో చర్చలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇక చివరి రోజు కూడా ఇవే సంఘటనలు సభలో పునరావృతమయ్యాయి. రెండుసార్లు సభ వాయిదా వేసి, మూడోసారి సమావేశ పరిచిన స్పీకర్.. అకస్మాత్తుగా చర్చా వివరాలను ప్రకటించి, ఇంతవరకూ రికార్డైన 86 మంది ప్రసంగాలలో పాటు ఎమ్మెల్యేలు ఇచ్చిన లిఖితపూర్వక సమాచారాన్ని, బిల్లుకు సూచించిన 9072 సవరణలను కలిపి రాష్ట్రపతికి పంపిస్తానని సభలో ప్రకటించారు. ఆ తర్వాత సీఎం ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ముందు ఓటింగ్ కు ఉంచారు. మూజువాణి ఓటింగ్ ను నిర్వహించి.. తీర్మానం నెగ్గిందని చెప్పి సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇక్కడే అసలు గొడవ మొదలయ్యింది.
రాష్ట్రపతి ఇచ్చిన గడువు ప్రకారం చర్చను ముగించేశారు స్పీకర్ నాదెండ్ల మనోహర్. సభ్యుల అభిప్రాయాలను రాష్ట్రపతికి పంపించనున్నారు. దీంతోపాటే, సభ బిల్లును తిరస్కరించాలని తీర్మానించిందంటూ రాష్ట్రపతికి పంపించనున్నారు. దీంతో బిల్లుపై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. అయితే, కేవలం అభిప్రాయాల కోసమే బిల్లును శాసనసభకు పంపించారు కాబట్టి, వాటినే రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకుంటారన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. అయితే, బిల్లును తిరస్కరిస్తూ సభ తీర్మానం చేసింది కాబట్టి, పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టకూడదని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. మూజువాణి ఓటంటే ఏకగ్రీవ నిర్ణయంతో సమానం కాబట్టి, సభంతా సమైక్యవాదానికే కట్టుబడి ఉందని గుర్తించాలన్నారు మంత్రి ఆనం.
సీఎం తీర్మానాన్ని సభలో నెగ్గించడం దుర్మార్గమంటూనే, చర్చ ముగిసినందుకు మాత్రం హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ నేతలు. తమకు కావాల్సింది అసెంబ్లీలో ప్రక్రియ ముగియడమేనంటున్నారు. ఢిల్లీ దిగ్విజయ్ సింగ్ చేసిన కామెంట్లూ దీనికి తగ్గట్లే ఉన్నాయి. సీఎం తీర్మానంపై మాత్రమే సభ ఓటింగ్ నిర్వహించిందని, బిల్లుపై కాదంటూ ఆయన ప్రకటించారు. పైగా, ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానికి సంక్రమించిన అధికారాలకు ఈ తీర్మానం ఏమాత్రం విఘాతం కలిగించదన్నారాయన. ఫిబ్రవరి 4న జీవోఎం సమావేశంలో అసెంబ్లీ పంపించిన అభిప్రాయాలపై చర్చించే అవకాశం ఉంది. సభ సూచించిన సవరణల్లో సహేతుకమైన వాటిని బిల్లులో పొందుపరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని భావిస్తున్న యూపీఏ సర్కార్కు బీజేపీ మద్దతు తప్పని సరి. అందుకే, బీజేపీ సూచిస్తున్న పోలవరానికి జాతీయ హోదా, పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో చేర్చడం, సీమాంధ్ర రాజధానికి నిర్ధిష్టమైన నిధుల కేటాయింపును ప్రకటించే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమైక్య తీర్మానం చేయగలిగిన సీమాంధ్ర నేతలు, ఇప్పుడు దృష్టంతా ఢిల్లీపై పెట్టారు. పార్లమెంట్లోనూ బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
కామెంట్ను పోస్ట్ చేయండి