రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఫోకస్ అంతా ఓ కుటుంబం పైనే ఉంది. అదే దగ్గుబాటి వెంకటేశ్వరరావు-పురందేశ్వరి కుటుంబం. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు జరుపుతోందన్న సమాచారం తెలుగు తమ్ముళ్లలో విస్మయాన్ని కలిగిస్తోంది. దీనికి అనుకూలంగానే పరుచూరులో "సొంతింటికి ఆహ్వానం" అంటూ దగ్గుబాటి ఫోటోతో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. వీటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు వాటిని చింపేశారు. అయినప్పటికీ తెరవెనుక ఏదో జరుగుతోందని, లేకపోతే ఈ పోస్టర్లు ఎందుకు వెలుస్తాయంటూ కొంతమంది టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి, ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేయడంతో చేయీచేయీ కలిపి పనిచేసిన నారా, దగ్గుబాటి కుటుంబాలు తర్వాత మాత్రం పదవుల పంపకాల్లో వచ్చిన తేడాలతో ఎడమొహం పెడమొహం అయ్యాయి. దగ్గుబాటి కొంతకాలం బీజేపీలో ఉండి, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి తాను ఎమ్మెల్యే అవడమే కాక, తన భార్య పురందేశ్వరిని ఎంపీని , కేంద్రమంత్రిని చేయించుకోగలిగారు. అయితే, సమైక్య ఉద్యమంతో పరిస్థితులు మారడంతో పాటు, కాంగ్రెస్ నుంచి మళ్లీ పోటీ చేస్తే గెలవమేమో అన్న అనుమానం అటు వెంకటేశ్వరరావు, ఇటు పురందేశ్వరికీ ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి పోటీకోసం కొంతకాలం క్రితం సమాలోచనలు జరిపిన వీరిద్దరూ అక్కడ వ్యతిరేకత రావడంతో నరసాపురం ఎంపీ స్థానంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో, నరసాపురం సీటు పై తమకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇప్పటినుంచే మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఉన్నతస్థాయిలోనే సాగుతున్న ఈ చర్చలు దగ్గుబాటి ఫ్యామిలీకి అనుకూలంగానే ఉన్నట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి.
వాస్తవానికి, ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేయడంతో చేయీచేయీ కలిపి పనిచేసిన నారా, దగ్గుబాటి కుటుంబాలు తర్వాత మాత్రం పదవుల పంపకాల్లో వచ్చిన తేడాలతో ఎడమొహం పెడమొహం అయ్యాయి. దగ్గుబాటి కొంతకాలం బీజేపీలో ఉండి, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి తాను ఎమ్మెల్యే అవడమే కాక, తన భార్య పురందేశ్వరిని ఎంపీని , కేంద్రమంత్రిని చేయించుకోగలిగారు. అయితే, సమైక్య ఉద్యమంతో పరిస్థితులు మారడంతో పాటు, కాంగ్రెస్ నుంచి మళ్లీ పోటీ చేస్తే గెలవమేమో అన్న అనుమానం అటు వెంకటేశ్వరరావు, ఇటు పురందేశ్వరికీ ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి పోటీకోసం కొంతకాలం క్రితం సమాలోచనలు జరిపిన వీరిద్దరూ అక్కడ వ్యతిరేకత రావడంతో నరసాపురం ఎంపీ స్థానంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో, నరసాపురం సీటు పై తమకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇప్పటినుంచే మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఉన్నతస్థాయిలోనే సాగుతున్న ఈ చర్చలు దగ్గుబాటి ఫ్యామిలీకి అనుకూలంగానే ఉన్నట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి.
కామెంట్ను పోస్ట్ చేయండి