రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకపోయినా, విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ భావ దారిద్ర్యం మరోసారి బయటపడింది. రాహుల్ కు ప్రచార పగ్గాలు అప్పగించిన తర్వాత శుక్రవారం రోజు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన పత్రికల్లోనూ, ప్రధాన నగరాల్లో హోర్డింగుల రూపంలోనూ భారీగా ప్రకటనలు ఇచ్చింది. రాహుల్ ఫోటోను ముందు పెట్టి, ఆయన వెనుక, అన్ని వర్గాల ప్రజలను ఉన్నట్లు చూపించిన ఈ ప్రకటనల్లో ఇచ్చిన స్లోగన్.. మై నహీ, హమ్.. అంటే.. నేను కాదు , మనం.. అందర్నీ తనవాళ్లను చేసుకోవడానికి రాహుల్ ఇచ్చిన ప్రకటనది. పైగా ఇది మోడీకి వ్యతిరేకంగా తయారు చేసిన యాడ్. మోడీ అంతా నేనే అంటున్నాడని, రాహుల్ సిద్ధంగా అందర్నీ కలుపుకుని వెళ్లాలని చెప్పాలనుకొంది కాంగ్రెస్, కానీ, అక్కడే కాంగ్రెస్ చెవిలో కమలం పువ్వు పడింది.
రాహుల్ ప్రకటనలో ఉన్న స్లోగన్ ను మోడీ ఎప్పుడో వాడేశారు. ప్రభుత్వ అధికారుల్లో స్ఫూర్తి నింపడం కోసం ఏర్పాటు చేసిన ఓ సభలో మై నహీ, హమ్ అన్న స్లోగన్ ను ఉపయోగించారాయన. ఈ విషయం గుర్తించని కాంగ్రెస్ దాన్నే తమ పార్టీ లైన్ గా భారీగా ప్రకటనలు ఇచ్చింది. దీంతో, ఆన్ లైన్ లో రెండింటినీ పోల్చుతూ నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. మీడియా కూడా దీన్ని పెద్దది చేసి చూపడంతో ఒక్కసారిగా అవాక్కైన కాంగ్రెస్, తన ప్రకటనలను ఉపసంహరించుకొంది. ఢిల్లీలో ఫ్లెక్సీలను వెంటనే మార్చేసింది. అదే అర్థం వచ్చినట్లుగా, మరో స్లోగన్ ను తెరపైకి తెచ్చింది. అదే .. తోడే నహీ.. జోడే.. కాంగ్రెస్ కు సొంతగా ప్రచారం చేసుకునే సత్తా కూడా లేకే, మోడీ స్లోగన్స్ పై పడిందంటూ బీజేపీ మండిపడింది.
రాహుల్ ప్రకటనలో ఉన్న స్లోగన్ ను మోడీ ఎప్పుడో వాడేశారు. ప్రభుత్వ అధికారుల్లో స్ఫూర్తి నింపడం కోసం ఏర్పాటు చేసిన ఓ సభలో మై నహీ, హమ్ అన్న స్లోగన్ ను ఉపయోగించారాయన. ఈ విషయం గుర్తించని కాంగ్రెస్ దాన్నే తమ పార్టీ లైన్ గా భారీగా ప్రకటనలు ఇచ్చింది. దీంతో, ఆన్ లైన్ లో రెండింటినీ పోల్చుతూ నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. మీడియా కూడా దీన్ని పెద్దది చేసి చూపడంతో ఒక్కసారిగా అవాక్కైన కాంగ్రెస్, తన ప్రకటనలను ఉపసంహరించుకొంది. ఢిల్లీలో ఫ్లెక్సీలను వెంటనే మార్చేసింది. అదే అర్థం వచ్చినట్లుగా, మరో స్లోగన్ ను తెరపైకి తెచ్చింది. అదే .. తోడే నహీ.. జోడే.. కాంగ్రెస్ కు సొంతగా ప్రచారం చేసుకునే సత్తా కూడా లేకే, మోడీ స్లోగన్స్ పై పడిందంటూ బీజేపీ మండిపడింది.
కామెంట్ను పోస్ట్ చేయండి