మానవాళికే ముప్పుతెచ్చిపెట్టే అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతికి చిక్కాయా.. త్వరలోనే మనదేశంలో అణుదాడులు జరుగుతాయా.. పోలీసుల అదుపులో ఉన్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ చెబుతున్న విషయాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.
గుజరాత్ లోని సూరత్ లో చిన్నతరహా అణుబాంబులు పేల్చడానికి ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు తెలుస్తోంది. యాసిన్ సోదరుడుకు ఐఎం చీఫ్ రియాజ్ భత్కల్ ఈ అణుబాంబు సమకూర్చడానికి సిద్ధమయ్యాడు. దాడులు చేయడానికి అణుబాంబులు దొరుకుతాయా అంటూ రియాజ్ కు యాసిన్ ఫోన్ చేసి అడిగినప్పుడు, పాకిస్తాన్ లో ఏదైనా దొరుకుతాయని అతను సమాధానం ఇచ్చాడట. అయితే, సూరత్ లో దాడులు చేసినప్పుడు ముస్లింలు కూడా చనిపోతారు కాబట్టి, నగరాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ మసీదుల్లో పోస్టర్లు అతికిద్దామని కూడా భత్కల్ సోదరులు భావించారు. ఈ వివరాలన్నీ పోలీసుల ఇంటరాగేషన్ లో యాసిన్ భత్కల్ చెప్పినట్లు సమాచారం. అయితే, నేపాల్ సరిహద్దుల్లో భత్కల్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ దాడికి బ్రేక్ పడింది. కానీ, ఎప్పుడోకప్పుడు ఈ తరహా దాడులు జరగవచ్చని, అణు బాంబులను ఉగ్రవాదులు సమకూర్చుకుంటున్నారని నిఘా వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
30, డిసెంబర్ 2013, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి