17, అక్టోబర్ 2013, గురువారం
గీతారెడ్డికి పిలుపొచ్చింది
Categories :
congress . court notice . geeta reddy . jagan case . POLITICS . TOP
లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జ్షీట్లో పేరు దక్కించుకున్న మంత్రి గీతారెడ్డిని విచారణకు హాజరు కావాలంటూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను విచారణకు స్వీకరించిన కోర్టు గీతారెడ్డితో పాటు, జగన్, విజయసాయి రెడ్డి, ఇందు గ్రూప్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి, బాలాజీలకు నవంబర్ 15న కోర్టుకు రావాలంటూ నోటీసులను జారీ చేసింది. లేపాక్షి గ్రూప్ కు అనుకూలంగా గీతారెడ్డి వ్యవహరించారని సీబీఐ ఛార్జ్షీట్లో పేర్కొంది. గీతారెడ్డి కోర్టుకు వెళ్తితే ఇదే తొలిసారి అవుతుంది. సీబీఐ ఛార్జ్షీట్లో పేరు నమోదు చేసిన వెంటనే ఆమె ముఖ్యమంత్రిని కలిసి రాజీనామా లేఖను అందించారు. అయితే, దాన్ని ఇప్పటివరకూ పెండింగ్ ఉంచారు కిరణ్ కుమార్ రెడ్డి. అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులు పదవుల్లో ఉండకూడదని కాంగ్రెస్ పార్టీ కొంతకాలం నిర్ణయం తీసుకుంది. దీనికి తగ్గట్లుగానే, కోర్టుకు హాజరుకావడానికి ముందే సబితారెడ్డి, ధర్మానల రాజీనామాలను సీఎం ఆమోదించారు. ఇప్పుడు నవంబర్ 15లోపే గీతారెడ్డి రాజీనామాను కూడా ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే, జగన్ ఆస్తుల కేసులో మంత్రి పదవిని పోగొట్టుకున్న నాలుగో మంత్రి అవుతారు గీతారెడ్డి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి