రాష్ట్ర విభజనపై హస్తినలో కీలక చర్చలు జరుపుతున్నారు గవర్నర్ నర్సింహన్. మంగళవారమే ఢిల్లీ చేరుకున్న ఆయన బుధవారమంతా బిజీబిజీగా గడిపారు. ఉదయాన్నే ఆర్థికమంత్రి చిదంబరంతో అరగంటపాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం సోనియాగాంధీతో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య కూడా అరగంట పాటు చర్చలు జరిగాయి. హైదరాబాద్ అంశంపైనా, సీమాంధ్రలో ఉద్యమ తీరుపైనా గవర్నర్ సోనియాకు నివేదిక సమర్పించినట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ నర్సింహన్ ఇదే తరహా నివేదికలను ఇచ్చారు.సోనియాతో భేటీ అనంతరం హోంమంత్రి షిండేను కూడా కలుసుకున్నారు గవర్నర్. రాష్ట్ర విభజన నేపథ్యంలో శాంతిభద్రతలు, తదితర అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రి ఆంటోని, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని కూడా నర్సింహిన్ కలిసే అవకాశమున్నట్లు సమాచారం. గవర్నర్ ఇచ్చే నివేదికల ఆధారంగానే కేంద్రం విభజనపై ముందడుగు వేస్తుందన్న సమాచారం ఉండడంతో, ఆయన ఎలాంటి వివరాలు చెప్పారన్నదే ఉత్కంఠను కలిగిస్తోంది.
23, అక్టోబర్ 2013, బుధవారం
హస్తినలో నర్సింహ రాయభారం
Categories :
bifurcation . congress . governor . narasimhan . POLITICS . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి