ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల సర్వేలు ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నాయి. కాంగ్రెస్ పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న మధ్యప్రదేశ్లో మళ్లీ ఆ పార్టీకి ఎదురుదెబ్బే తగలనుంది. బీజేపీకి 148 నుంచి 160 సీట్లు రావచ్చని సీఎన్ఎన్-ఐబీఎన్, ది వీక్ లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. గత ఎన్నికల్లో బీజేపీకి 37.6 శాతం ఓట్లే పోలవ్వగా, ఈ సారి 44 శాతం ఓట్లను సంపాదించవచ్చని సర్వే అంచనా వేసింది. దీన్నిబట్టి చూస్తే, గతంలో కన్నా ఇప్పుడు మధ్యప్రదేశ్లో బీజేపీ మరింత బలపడిందని తెలుస్తోంది. కాంగ్రెస్కు కేవలం 52 నుంచి 62 సీట్లే వస్తాయని సర్వేలో తేలింది. ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్కు 71 సీట్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో బీజేపీ గెలిస్తే, మూడోసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆ రాష్ట్ర సీఎం చౌహాన్కు దక్కుతుంది.
ఛత్తీస్గఢ్లోనూ కమల విరబూయనుందని ఐబీఎన్ సర్వే చెబుతోంది. 91 సీట్లున్న అసెంబ్లీలో 61 నుంచి 71 సీట్లు బీజేపీకే దక్కుతాయని అంచనా వేసింది. కాంగ్రెస్కు కేవలం 16 నుంచి 24 సీట్లే దక్కవచ్చని సర్వేలో తేలింది. రమణసింగ్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసం వల్లే బీజీపీ మళ్లీ విజయం సాధించవచ్చంటోంది సీఎన్ఎన్-ఐబీఎన్, ది వీక్ సంయుక్త సర్వే.
29, అక్టోబర్ 2013, మంగళవారం
ఆ రెండు మళ్లీ కమలానివేనా..?
Categories :
bjp . Chhattisgarh . congress . five state election . madhya pradesh . POLITICS . pre poll survey . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి