24, అక్టోబర్ 2013, గురువారం
పసుపు పార్టీలో పయ్యావుల చిచ్చు
Categories :
bifurcation . payyavula keshav . POLITICS . tdp . TOP . ttdp fire
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును పయ్యావుల కేశవ్ ఆశ్రయించడం, తెలుగుదేశం పార్టీలోని తెలంగాణ ప్రాంత నేతల ఆగ్రహానికి కారణమయ్యింది. పయ్యావుల సుప్రీంను ఆశ్రయించడంతో, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎలా సమాధానం చెప్పుకోవాలో తెలియక సతమమతవుతున్నారు టీటీడీపీ నేతలు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమీ మాట్లాడని పయ్యావుల, ఇప్పుడు సుప్రీంను ఆశ్రయించడంపై టీటీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ సాకారం అవుతుంటే, అందులోనూ విభజనకు టీడీపీ మద్దతు ప్రకటించిన తర్వాత కేంద్రం ముందడుగు వేస్తుంటే, పయ్యావుల దానికి వ్యతిరేకంగా సుప్రీంను ఆశ్రయించడం సరికాదంటూ విమర్శలు చేశారు టీడీపీ నేతలు కొత్తకోట దయాకర్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు. కేశవ్ తీరుపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశామన్నారు ఎర్రబెల్లి. పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన పయ్యవులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోమంటామని కోరతామన్నారాయన.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి