16, అక్టోబర్ 2013, బుధవారం
మోడి కోసం వాస్తు వేదిక
ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఉత్తరప్రదేశ్ లో తొలిసారిగా అక్టోబర్ 19న మోడి తలపెట్టిన ర్యాలీ, బహిరంగ సభ విజయవంతం కావడానికి బీజేపీ నేతలు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే, యూపీలో సీట్లు చాలా కీలకం కాబట్టి, ఉత్తర ప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు మోడి. అందుకే, భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కాన్పూర్ లో జరిగే ఈ బహిరంగ సభ కోసం వంద అడుగుల పొడవప, 30 అడుగుల వెడల్పైన వేదికను ఏర్పాటు చేస్తున్నారు. వాస్తు పరంగా అన్నీ సక్రమంగా ఉండేలా ఈ వేదికను రూపొందిస్తున్నారు బీజేపీ నేతలు. జ్యోతిష పండితులను కూడా పిలిచి, ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకు దేవుళ్లకు శాంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్ వెబ్ సైట్స్ ద్వారా ఆహ్వాన పత్రాలను సైతం పంపిస్తున్నారు. భారీగా పోస్టర్లు, ఫ్లెక్సీలతో హడావుడి చేస్తున్నారు బీజేపీ నేతలు. ఒకప్పుడు యూపీలో అధికారాన్ని అనుభవించి, ఆ తర్వాత ఘోరంగా దెబ్బతిన్న బీజేపీ, మోడి మ్యాజిక్ తో మళ్లీ పునర్ వైభవాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి