తెలంగాణ నోట్ ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు కావూరు సాంబశివరావు, పళ్లంరాజు. కేబినెట్ నోట్ ఆమోదం పొందనివ్వకుండా చూస్తామని ఇంతకాలం చెప్పిన నేతలు, ఆ పని చేయలేకపోవడంతో, పదవులను వదులుకున్నారు. టీనోట్ను ఆమోదించవద్దంటూ కేబినెట్ సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వీరిద్దరూ, సానుకూల స్పందన రాకపోవడంతో, మధ్యలోనే బయటకు వచ్చేశారు.చిరంజీవి కూడా మంత్రి పదవికి రాజీనామా చేశారు. మిగిలిన సీమాంధ్ర మంత్రులు కూడా రాజీనామాల బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఏపీఎన్జీవోలు కూడా ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తుండడంతో, నేతలు పదవులను వదులుకోక తప్పేట్లు లేదు.ఇప్పటికే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్పీకర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఉండవల్లి, అనంత వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు
సీడబ్ల్యూసీ ప్రకటన వచ్చినప్పటినుంచి రెండు నెలలుగా తీవ్రస్థాయిలో సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్నా, ఏమాత్రం పట్టించుకోకుండా టీనోట్ కేంద్రం ఆమోదించడంపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. ఇప్పటివరకూ జరిగిన పోరాటం ఓ ఎత్తైతే ఇకపై జరిగే పోరాటం మరోలా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం వెనక్కి తగ్గేవరకూ ఉద్యమాన్ని మహోగ్రంగా కొనసాగిస్తామంటున్నారు.
3, అక్టోబర్ 2013, గురువారం
సీమాంధ్ర కేంద్ర మంత్రుల రాజీనామా
Categories :
cabinet note . congress . kavuri . pallam raju . POLITICS . resign . seemandhra . t note . telangana . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి