|
పడవ ఎక్కబోతూ పడిపోయిన చిరంజీవి |
కేంద్రమంత్రి చిరంజీవి కాలు జారి వరదనీటిలో పడ్డారు. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లడానికి పడవ ఎక్కుతుండగా ఒక్కసారిగా జారిపోయి, నీళ్లల్లో పడిపోయారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం పేట కాలువ గట్టున దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వెంటనే తేరుకున్న ఆయన బాడీగార్డ్తో పాటు, మంత్రి తోట నర్సిహం, ఎమ్మెల్యే కన్నబాబులు చిరంజీవిని పట్టుకుని పైకి లేపి ఒడ్డుకు చేర్చారు. అనంతరం గొల్లప్రోలులో వరదబాధిత ప్రాంతాలను చూడడానికి ట్రాక్టర్లో వెళుతున్న సమయంలోనూ ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యింది. డ్రైవర్ వెంటనే ట్రాక్టర్ ను ఆపివేయడంతో ప్రమాదం తప్పింది. అంతకు ముందు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో బాధితులను పరామర్శించారు చిరంజీవి. కేంద్ర మంత్రిగా ఉండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయకూడదని, కానీ రైతుల బాధలు చూశాక రుణాలు మాఫీ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తాననన్నారాయన. ట్రాక్టర్లో నుంచి కిందకు దిగకుండా కబుర్లు చెప్పడంపై ఆగ్రహించిన గొల్లప్రోలు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవిని నిలదీయడంతో ఆయన కిందకు దిగి బాధితులతో మాట్లాడారు.
కామెంట్ను పోస్ట్ చేయండి