యాసిన్ భత్కల్ అనుచరుడు తెహసీన్ అక్తర్ |
అక్టోబర్ 27,2013 ఆదివారం ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.30 మధ్య పాట్నాలో ఎనిమిది వరుస పేలుళ్లు సంభవించాయి. రెండు రైల్వే స్టేషన్లో పేలగా మరో ఆరు మోడి సభ జరుగుతున్న గాంధీ మైదాన్ దగ్గర విస్పోటనం చెందాయి. ఈ పేలుళ్లలో మొత్తం ఆరుగురు మృతి చెందారు. 83 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే స్టేషన్లో పేలుడు జరిగిన వెంటనే పారిపోతున్న ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్నుంచి కీలక వివరాల కూపీ లాగారు. అతనిచ్చిన సమాచారంతో జార్ఖండ్ రాజధాని రాంచీలో దాడులు జరిపిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరంతా ఐఎం ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. పేలుళ్లకు ముందే 11 మంది పాట్నాలో రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల ముందు నిందితులు ఒప్పుకున్నారు.
అయితే, ఈ పేలుళ్లకు సంబంధించి జాతీయ నిఘావర్గాలు గానీ, బీహార్ రాష్ట్ర నిఘా వర్గాలు కానీ ఎలాంటి హెచ్చరికలు చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారంగా ఉగ్రవాదుల కదలికలపై ఎప్పుడూ కీలక హెచ్చరికలు చేస్తుంటాయి. కానీ, ఈ సారి అలాంటి సమాచారం లేకపోవడంతో మోడి సభకు భద్రత కల్పించే విషయంలో ఉదాసీనంగా పోలీసులు వ్యవహరించారు. నిఘా వర్గాలకు కూడా చిక్కకుండా ఉగ్రవాదులు ఎలా ప్రణాళికను అమలు చేశారన్నదానిపైనే ఇప్పుడు దర్యాప్తు బృందాలు ప్రధానంగా దృష్టి సారించాయి.
కామెంట్ను పోస్ట్ చేయండి