రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించారు. దాదాపు రెండు నెలలుగా వీటిని పెండింగ్ లో ఉంచుకున్న స్పీకర్.. కొన్నిరోజులుగా ఎంపీలను కలవడానికి కూడా ఇష్టపడడం లేదు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ముఖ్యంగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రతీరోజు స్పీకర్ కార్యాలయానికి వెళుతున్నారు. చాలాసార్లు స్పీకర్ కార్యాలయంలో లేకపోగా, గురువారం రోజు ఆఫీస్ లో ఉన్నప్పటికీ ఆయన్ను కలవడానికి ఇష్టపడలేదు. పైగా, రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడం లేదంటూ ఆయన ఢిల్లీ హైకోర్ట్ ను కూడా ఆశ్రయించారు. తన రాజీనామాపై నిర్ణయం తీసుకోకపోతే దీక్షకు దిగుతానని కూడా హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలు, సమైక్యవాదుల ఒత్తిడి కారణంగానే ఎంపీలు రాజీనామా చేశారని భావించిన స్పీకర్.. లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్కుమార్, కనుమూరి బాపిరాజు, ఎస్పీవై రెడ్డి, సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, హర్షకుమార్, మాగుంట శ్రీనివాసరెడ్డి, సబ్బం హరి, వైఎస్ జగన్, మేకపాటి రాజమోహన్రెడ్డి, కొనకళ్ల నారాయణ లు చేసిన రాజీమానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీలకు ఈ సమాచారాన్ని ఫోన్ ద్వారా స్పీకర్ కార్యాలయం తెలియజేసింది.
కోర్టుకు వెళ్లే యోచనలో వైసీపీ
స్పీకర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ, ఈ విషయంలో కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. జగన్, మేకపాటి, ఎస్పీవైరెడ్డిలు స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామాలు చేసినప్పటికీ ఆమోదించకపోవడం సరికాదని పార్టీ పేర్కొంది.
18, అక్టోబర్ 2013, శుక్రవారం
రాజీనామాలకు నో అన్న స్పీకర్
Categories :
congress . meera kumar . mps . mps resign . POLITICS . reject . seemandhra . speaker . tdp . TOP . ysrcp
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి