17, అక్టోబర్ 2013, గురువారం
సమ్మె విరమించిన ఏపీఎన్జీవోలు
Categories :
apngo . news . samaikya protest . seemandhra . strike call off . TOP
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ డిమాండ్ చేస్తూ 65 రోజులుగా సమ్మె చేస్తున్న ఏపీఎన్జీవోలు, ఉద్యోగ సంఘాలు ఎట్టకేలకు సమ్మె విరమించాయి. సమ్మె విరమించాలా వద్దా అన్న దానిపై బుధ,గురు వారాల్లో సుదీర్ఘంగా చర్చించిన ఉద్యోగులు, చివరకు ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అసెంబ్లీ సమావేశాలు మొదలవగానే మళ్లీ సమ్మె మొదలుపెడతామని హెచ్చరించారు. ఒకవేళ ఈ మధ్యలోనే పార్లమెంట్లో బిల్లు వస్తే గనక మెరుపుసమ్మెకు దిగుతామన్నారు ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబు. ఈ అర్థరాత్రి నుంచి ఉద్యోగులం విధులకు హాజరవుతామన్నారాయన. తీర్మానం, బిల్లు రెండూ అసెంబ్లీకి వస్తాయని సీఎం తమకు చెప్పారని, అసెంబ్లీలో, పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు అడ్డుపడే అంశాలు ఎన్నో ఉన్నాయని, ఆ నమ్మకం తోనే తాము సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారాయన. రాష్ట్ర విభజన జరగదనే నమ్మకం తమకు పూర్తిగా ఉందన్నారు అశోక్బాబు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి