కేంద్రం నిర్ణయం తీసేసుకుంది. విభజన ప్రక్రియ నుంచి ఒక్క అడుగుకూడా వెనక్కి వేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీమాంధ్ర నేతలు, ఎంపీలు, కేంద్రమంత్రులు మొండితనాన్ని, మూఢత్వాన్ని వదిలి, ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన వనరులు,హక్కుల కోసం పోరాడాలన్నారు కేంద్రమంత్రి పురంధేశ్వరి. వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినే అయినప్పటికీ, అందరూ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారామె. ఇంకా సమైక్యవాదాన్నే వినిపిస్తే సీమాంధ్రకు సాధించాల్సినవి కోల్పోతామన్నారు పురంధేశ్వరి. ఎన్టీవీ కేఎస్ఆర్ లైవ్ షోలో ఇంటర్వ్యూ ఇచ్చిన చిన్నమ్మ, రాష్ట్ర విభజనకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ విశాఖ నుంచే పోటీ చేస్తానన్నారు పురంధేశ్వరి.
పురంధేశ్వరి వ్యాఖ్యలకు ఆగ్రహించిన ఆంధ్రాయూనివర్సిటీ విద్యార్థులు పురంధేశ్వరి దిష్టిబొమ్మను తగలబెట్టారు.
15, అక్టోబర్ 2013, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి