14, సెప్టెంబర్ 2013, శనివారం
సోనియా ముందే పంచాయతీ పెడదాం..
Categories :
central ministers . congress . POLITICS . resigns . seemandhra . telangana . TOP
భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం కోసం హైదరాబాద్లో సమావేశమైన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు పార్టీ అధినేత్రి సోనియాను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. సీమాంధ్రలో 46 రోజులుగా జరుగుతున్న పోరాటంతో హైకమాండ్ పునరాలోచనలో పడిందని, ఇదే సమయంలో మరింతగా ఒత్తిడి పెంచడానికి అమ్మగారిని కలిసి అభ్యంతరాలను వివరించాలని నిర్ణయించారు. రాజీనామాల విషయంలో మాత్రం సీమాంధ్ర కేంద్రమంత్రులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎంపీలు మాత్రం గతంలో ఇచ్చిన రాజీనామా లేఖలకు కట్టుబడే ఉన్నామని ప్రకటించారు. అయితే.. పదవులకన్నా ప్రజలే తమకు ముఖ్యమంటూ సమావేశం అనంతరం ప్రకటించారు కేంద్ర మంత్రి కావూరి. తక్షణం ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించి, సీమాంధ్రలో ఉద్యమాన్ని చూడాలని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరతామన్నారాయన. మినిస్టర్స్ క్వార్టర్స్ క్లబ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు,జేడీ శీలం, పల్లంరాజు, పురంధేశ్వరి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంతవెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, కేవీపీ రామచంద్ర రావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. కేంద్రమంత్రులు కిషోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణితోపాటు ఎంపీలు రాయపాటి సాంబశివరావు, చింతా మోహన్, హర్షకుమార్ సబ్బం హరి, టి.సుబ్బరామిరెడ్డి, నేదురమల్లి జనార్ధన రెడ్డి, బొత్స ఝాన్సీసమావేశానికి దూరంగా ఉన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి