30, సెప్టెంబర్ 2013, సోమవారం
లాలూ జైలు పాలే..
Categories :
BIHAR . cbi . FODDER SCAM . jail . LALU PRASAD YADAV . news . POLITICS . TOP
దేశ వ్యాపంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్యాదవ్ను రాంచీ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. 16 ఏళ్ల క్రితం మొదలైన ఈ కేసు విచారణకు, ఎట్టకేలకు శుభం కార్డు పడింది. బీహార్ ముఖ్యమంత్రిగా లాలూప్రసాద్ ఉన్నప్పుడు పశువుల దాణాకు సంబంధించి 37కోట్ల 70 లక్షలు కాజేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇరుక్కోవడంతో బీహార్ సీఎం కుర్చీ నుంచి దిగిపోయిన లాలూ, తన భార్య రబ్రీదేవిని పదవిలో కూర్చోబెట్టి పాలన సాగించారు. సుదీర్ఘకాలం జరిగిన దర్యాప్తు, విచారణ అనంతరం సీబీఐ కోర్టు, లాలూను దోషిగా తేల్చింది. ఆయన తో పాటు మరో 45 మందిని దోషులుగా నిర్థారించింది. వీరందరికీ అక్టోబర్ 3న శిక్షలు ఖరారు చేయనుంది కోర్టు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం లాలూ ప్రసాద్కు మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సీబీఐ
కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే లాలూను బిర్సాముండా సెంట్రల్ జైలుకు తరలించారు. ఒకప్పుడు బీహార్ లో ఏకఛత్రాధిపత్యం వహించిన లాలూకు ఇది ఊహించని పరిణామమే. ఇప్పటికే కుదేలైన ఆర్జేడీ కి కూడా కోలుకోలేని దెబ్బే. అంతేకాదు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కూడా ఇదే కేసులో దోషిగా తేలి జైలుపాలయ్యారు. ఒకే కేసులో రెండు ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు, అందునా ముఖ్యమంత్రులుగా పనిచేసినవాళ్లు జైలుకు వెళ్లడం ఇదే ప్రథమం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి