నమ్మకం నట్టేటమునిగింది
అగ్నిసాక్షిగా చేపట్టిన బంధమే అంతం చేసింది
వందేళ్లనుకున్న జీవితం
వందరోజులకే ముగిసిపోయేలా చేసింది
కట్టుకున్న భార్యే కడతేర్చింది
అనుకున్నదే అయ్యింది. అనుమానం నిజమయ్యింది. సెప్టెంబర్ 14న సంఘీ టెంపుల్ నుంచి వస్తున్న భార్యభర్తలపై దుండగులు దాడి చేశారని, ఈ దాడిలో భర్త వెంకటేశ్వరరావు హతమయ్యాడని, భార్య సౌజన్యకు తీవ్ర గాయాలు అయ్యాయన్న వార్త హైదరాబాద్ లో తీవ్ర కలకలం పుట్టించింది. అయితే, ఈ దాడి జరిగిన తీరుపై అప్పట్లోనే ఎన్నో అనుమానాలయ్యాయి. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు భార్య, ఆమె ప్రియుడు కలిసి ఈ హత్య చేసినట్లుగా తేల్చారు.
వెంకటేశ్వరరావు ఆర్టీసీలో మెకానిక్ గా పనిచేస్తుండగా, సౌజన్య బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. , వీరిద్దరికీ మే 29న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత సౌజన్య బెంగళూరుకు వెళ్లిపోయింది, వెంకటేశ్వరరావు ఉద్యోగం రీత్యా ఇక్కడే ఉంటున్నాడు. వారాంతాల్లో హైదరాబాద్ కు వస్తూ వెళుతోంది సౌజన్య. కానీ, ఈ పెళ్లంటే ఆమెకు ఇష్టంలేదు. అంతకు ముందే ఆమె మరొకరిని ప్రేమించింది. అతడితో కలిసి వెంకటేశ్వరరావును అడ్డుతొలగించుకోవాలని పన్నాగం పన్నింది. ప్లాన్ ప్రకారం భర్తను సంఘీటెంపుల్ కు తీసుకువెళ్లింది. తిరిగి వచ్చే దారిలో ఎవరూ లేని చోట దాడి చేయించింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడం కోసం తన చేతులూ కోసుకుంది. కానీ, కాల్ రికార్డులు అసలు దొంగను పట్టించాయి.
వెంకటేశ్వరరావు అడ్డు తొలిగితే సౌజన్య నచ్చినవాడిని పెళ్లిచేసుకోవచ్చు.. కానీ, అతన్ని హత్య చేస్తే, తాను హంతకురాలై జైలు గోడల మధ్య బతకాల్సి వస్తుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినా, ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యింది. హత్యకు బదులు వెంకటేశ్వరరావుకే అసలు విషయం చెబితే, ఈ కథ మరోలా ఉండేదేమో..
20, సెప్టెంబర్ 2013, శుక్రవారం
విశ్వాస ఘాతుకం
Categories :
crime . hyderabad . murder . news . sanghi temple road murder . TOP . wife killed husband
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి