తెలంగాణ కేబినెట్ నోట్ ప్రతి సిద్ధమయ్యిందన్న హోంమంత్రి షిండే ప్రకటన అటు ఢిల్లీలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఒక్కసారిగా కలకలం పుట్టించింది. ఆంటోనీ కమిటీ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న సీమాంధ్ర నేతలు ఒక్కసారిగా ఈ ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంటోనీ కమిటీ నివేదిక రాకుండా కేబినెట్ నోట్ ఎలా తయారు చేస్తారంటూ ప్రశ్నించారు. దిగ్విజయ్ ను కలిసి తమ అభ్యంతరాలను తెలిపారు. కేబినెట్ నోట్ విషయంలో కేంద్రం ముందుకు వెళితే గనక, తాము పదవులకు రాజీనామా చేస్తామంటూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు ఓ లేఖను రాశారు. దీన్ని సోనియాకు అందించాలని దిగ్విజయ్ ను కోరారు.
అటు తెలంగాణ విషయంలో కేంద్రం మాత్రం ముందడుగు వేయాలనే భావిస్తున్నట్లు సమాచారం. హోంశాఖకు అందిన ముసాయిదా ప్రతిని యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్ల పరిశీలనకు పంపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుండడంతో, తెలంగాణ అంశంపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, కేబినెట్ నోట్ ను ఇంకా షిండే, మన్మోహన్, సోనియాలు పరిశీలించకపోవడంతో, కేబినెట్ ముందుకు వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఆంటోనీ కమిటీ కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అందులో పేర్కొన్న అంశాలను కూడా ఈ ముసాయిదాలో చేర్చి, నోట్ ను న్యాయశాఖకు పంపించనుంది హోంశాఖ. ప్రస్తుతం సీమాంధ్ర నేతల అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం ముందడుగు వేస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
19, సెప్టెంబర్ 2013, గురువారం
కాక రేపుతున్న కేబినెట్ నోట్
Categories :
cabinet note . congress . POLITICS . seemandhra . shinde . telangana . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి