17, సెప్టెంబర్ 2013, మంగళవారం
అసలు నిజం ఒప్పుకున్న వర్మ
తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో, తనను తాను విమర్శించుకోవడంలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మను మించినోడు ఎవరూ ఉండరన్నది జగమెరిగిన సత్యం. అందుకే, ఆయన ఏది మాట్లాడినా, ఏం చేసినా పెద్ద సంచలనం అవుతుంది. ఎప్పటిలానే మరోమారు తనపై తాను ఓ వెరైటీ సెటైర్ వేసుకున్నాడు వర్మ. ఆయన తీస్తున్న సినిమాలు వరసగా ప్లాప్ అవుతున్న సమయంలో, ఇక వర్మ సినిమాలు తీయడం అవసరమా అన్న విమర్శలు చెలరేగుతున్నసమయంలో తన పాత ఫార్ములానే మళ్లీ జనంపైకి వదులుతున్నాడు వర్మ. సూపర్ హిట్ సినిమా సత్య కు సీక్వెల్ గా సత్య -2 ను సిద్ధం చేశాడు. ఈ సినిమా ఎందుకు తీశారన్నదానికి ఎవరూ అడగకుండానే ఆన్సర్ ఇచ్చేశాడు రామ్. "సీమ ఫ్యాక్షనిస్టులు నశించారు గనక, విజయవాడ రౌడీలు దిక్కులేకుండా పోయారు గనక, హైదరాబాద్ రౌడీలు ఇంకేమీ దొబ్బించుకోలేరు కనుక.. సత్య-2 వస్తున్నాడు" అంటూ ఆడియో రిలీజ్ బ్యానర్ పై పేర్కొన్నారు. ఈ మాటల్లోనే చరిత్రంతా చెప్పేశారాయన. రక్తచరిత్రకు మంచి టాక్ వచ్చినా ఆశించినంత హిట్ కాకపోవడం, బెజవాడ రౌడీలు అట్టర్ ప్లాప్ కావడం, గాయం-2 కూడా చెత్తబుట్టలో పడిపోవడం వల్ల, తనకు ఇక మిగిలింది ఒక్క సత్యనే అన్న అసలు సత్యాన్ని బయటపెట్టేశారు. ఎంతైనా నిజం ఒప్పుకోవడానికి చాలా గట్స్ కావాలి.. అవి ఉన్నాయి కాబట్టే.. వర్మ అయ్యాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి