15, సెప్టెంబర్ 2013, ఆదివారం
కాక రేపిన రేణుక రాక
Categories :
congress . POLITICS . renuka chowdary . t leaders meet . telangana . TOP
భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి మంత్రుల నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశంలో ఉత్కంఠ భరిత పరిణామాలు ఎదురయ్యాయి. మొదట్నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చి, సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత కూడా ఉత్తరాంధ్రను తెలంగాణను కలిపి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ చెప్పిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి తొలిసారి తెలంగాణ నేతల సమావేశానికి హాజరయ్యారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎంపీ పొన్నం, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేణుక రాగానే పొన్నం సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. ఆయన్ను షబ్బీర్ అలీ వారించారు. అయితే, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, ఉద్యమంలో ఇంతవరకూ కలవని వారిని ఈ సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారంటూ దామోదర్ రెడ్డి నేతలతో వాగ్వాదానికి దిగారు. ఆమెను బయటకు పంపించేయాలని డిమాండ్ చేశారు. అయితే, తెలంగాణ సాధన దిశగా ముందడుగు పడిన సందర్భంలో అందర్నీ కలుపుకుని వెళ్లాలంటూ జానారెడ్డి, ఇతర నేతలు సర్దిచెప్పారు. చిన్న మాటన్నా తోకతొక్కిన త్రాచులా లేసే రేణుక, ఈ మొత్తం వివాదానికి కేంద్రమైనప్పటికీ, ఒక్కమాటైనా మాట్లాడకుండా ఆద్యంతం మౌనంగానే ఉన్నారు. అటు, ఓయూ జేఏసీ నేతలు ఈ సమావేశంలోకి దూసుకువచ్చి, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ డిమాండ్ చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి