ఈ ఫోటో ఫేస్ బుక్ లో తెగ తిరుగుతోంది. ఫోటోలో విషయం కరెక్ట్ కాదు గానీ, దానికి ఉపయోగించిన టైటిల్ మాత్రం కరెక్టే. ఎందుకంటే, 1956 నాటికి హైదరాబాద్ ఏదీ లేదని, మొక్కనాటి, నీళ్లు పోసి పెంచి పెద్దది చేస్తే తెలంగాణవాళ్లే ఫలాలన్నీ తింటున్నారని చెబుతుంది. ఇదెక్కడి న్యాయం.. రాష్ట్రం విలీనం అయ్యేనాటికి హైదరాబాద్ లాంటి నగరం ఉమ్మడి రాజధానిలో ఎక్కడా లేదు. అసెంబ్లీ భవనం ఉంది, కోర్టు బిల్డింగ్ లు ఉన్నాయి, ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగపడే వందలాది భవనాలు సిద్ధంగా ఉన్నాయి, స్టేడియాలున్నాయి, పార్క్ లు ఉన్నాయి.. ఇక నిజాం పెట్టిన ఎన్నో కంపెనీలున్నాయి.
|
చార్మినార్ |
నిజాం ఏర్పాటు చేసిన నిజాం రోడ్ ట్రాన్స్ పోర్టే ఆ తర్వాత ఏపీఎస్ ఆర్టీసీగా మారిందన్న విషయం అందరికీ తెలిసిందే. నిజాం రైల్వేస్ సెంట్రల్ రైల్వేలో భాగంగా, ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వేగా మారిందన్నవిషయాన్ని అంతా గుర్తుచేసుకుంటే మంచిది. నిజాం హాయంలో సనత్ నగర్ ప్రాంతం పారిశ్రామికకేంద్రంగా అభివృద్ధి చెందింది.
|
ఉస్మానియా హాస్పిటల్ |
ఆల్విన్ మెటల్ వర్క్స్ (ఆల్విన్ వాచెస్, ఆల్విన్ రిఫ్రిజిరేటర్స్, ఆల్విన్ మోటర్స్), నిజాం షుగర్స్ (ఆసియాలోనే ఒకప్పుడు అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ), సిర్పూర్ పేపర్ మిల్స్ (ఆదిలాబాద్) ప్రాగా టూల్స్, ఆజంజాహీ మిల్స్ (వరంగల్), వజీల్ సుల్తాన్ టొబాకో కంపెనీ, హైదరాబాద్ ఆస్బెస్టాస్, హైదరాబాద్ ఇండస్ట్రీస్ సింగరేణి కోల్ మైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్, సిటీ కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలాంటివి ఎన్నో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇంతగా అభివృద్ధి చెందిన ప్రాతంలో అప్పట్లో భారతదేశంలోనే లేదని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
|
నాంపల్లి రైల్వే స్టేషన్ |
ఆల్విన్ రిఫ్రిజిరేటర్ ఒకప్పుడు దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఫ్రిజ్. 1952 సాధారణ ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్ బాక్సుల్లో ఎక్కువగా తయారు చేసింది కూడా ఆల్వినే. హైదరాబాద్, ఆంధ్ర విలీనమయ్యి ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత ఈ కంపెనీలన్నీ కనుమరుగైపోయాయి. నష్టాల పేరుతో, ఒక్కొక్కదాన్నే ప్రభుత్వాలు తెగనమ్ముతూ వచ్చాయి.
ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలు చాలావరకూ హైదరాబాద్ లోనే ఏర్పాటు కావడానికి ప్రత్యేక కారణం ఉంది. సముద్ర తీరానికి దూరంగా ఉండడం, మనకు శత్రువులైన పాకిస్తాన్, చైనాలకు సుదూర ప్రాతంలో ఉండడం వల్లే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీడీఎల్, హెచ్ఏఎల్ లాంటి రక్షణరంగ సంస్థలు హైదరాబాద్లో ఏర్పాటయ్యాయి.
|
మొజంజాహీ మార్కెట్ |
కర్నూలు రాజధానిగా ఎలాంటి భవనాలు, ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని స్థితిలో హైదరాబాద్ కు రాజధాని తరలిందే తప్ప, హైదరాబాద్ ను అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే, రాష్ట్రానికి రాజధాని కావడం, పరిపాలనాపరమైన సౌలభ్య ఉండడంతో ఆ తర్వాత చాలా కంపెనీలు హైదరాబాద్ చుట్టుపక్కల విస్తరించాయి. దీనివల్ల ఎక్కువగా లబ్దిపొందింది కూడా సీమాంధ్ర వ్యాపారవేత్తలే. ఆంధ్రప్రదేశ్ హయాంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలు హైదరాబాద్ లో బాగా అభివృద్ధి చెందాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ మద్రాస్ నుంచి తరలివచ్చింది. కొన్ని ఫీలింగ్స్ చాలామందిలో బలంగా ఉంటాయి హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టింది మేమే ( ఈ పేరుతో ఫేమస్ అయిన బిల్డింగ్ ఎల్ అండ్ టీ వాళ్ల ప్రైవేట్ ప్రాపర్టీ, ఈ ప్రాంతంలో ఉన్న కంపెనీలన్నీ ప్రైవేటు కంపెనీలే. పైగా, వీటి కోసం భూములు కోల్పోయింది మాత్రం తెలంగాణ ప్రజలు),
|
నిజాం ఎయిర్ పోర్ట్ |
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టింది మేమే ( జీఎంఆర్ ప్రైవేట్ ప్రాపర్టీ, పైగా, బేగంపేటలో ఉన్న ప్రభుత్వ ఎయిర్ పోర్ట్ ను మూసేసి మరీ జీఎంఆర్ కు పర్మిషన్ ఇచ్చారు. దీని వల్ల యూజర్ ఛార్జీల పేరుతో ప్రయాణీకులు ప్రతి జర్నీకి భారీగా డబ్బులు కట్టాల్సి వస్తోంది. )
ట్యాంక్ బండ్ కట్టించింది ఎన్టీఆరే.. (ఈ ట్యాంక్ బండ్ ఎప్పటి నుంచో ఉంది, ఎన్టీఆర్ చేసిందల్లా సాగర్లో బుద్ధ విగ్రహం పెట్టించడం, ట్యాంక్ బండ్ పై తెలుగువాళ్ల విగ్రహాలు పెట్టించడం మాత్రమే)
|
పరేడ్ గ్రౌండ్స్ |
1956 నాటికే ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో కలిసినా కలవకపోయినా, ఈ మాత్రం అభివృద్ధి చెందేది. దీన్ని కేవలం సీమాంధ్ర ప్రజల గొప్పతనంగానే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే, ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏమిటంటే, ఈ యాభై ఏళ్ల కాలంలో విశాఖ మినహా, మిగిలిన ఏ నగరమూ (అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణలో ) అభివృద్ధి చెందకపోవడం, ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం నిజంగా పాలకుల అసమర్థతే. దానివల్లే ఇప్పుడు ఇన్ని సమస్యలు. హైదరాబాద్ ను మేము మాత్రమే అభివృద్ధి చేశామని చెప్పుకునే వాళ్లు.. ఒక్కసారి చరిత్రతను తిరగేస్తే మంచింది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఫలాలిచ్చే చెట్టుకు సీమాంధ్రులు కాస్త ఎరువు వేశారు.. అది మరిన్ని ఫలాలను ఇచ్చింది. వాటినీ ఇంతకాలం సీమాంధ్ర ప్రజలు సంతోషంగానే తిన్నారు. అంతేకాని, మొక్కను నాటి, దానికి నీళ్లుపోసి, కాయలు కాసేలా చేసి, వాటిని కేవలం తెలంగాణకే వదిలేస్తామని అభిప్రాయపడడం మాత్రం పూర్తిగా అవివేకం.
|
లోయర్ ట్యాంక్ బండ్ |
|
nenu east godavari kakinada vaadini. meeru cheppina vishayam nenu oppukumtunnanu.....chakkani charithra photos tho visleshana baagumdi....ఈ యాభై ఏళ్ల కాలంలో విశాఖ మినహా, మిగిలిన ఏ నగరమూ (అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణలో ) అభివృద్ధి చెందకపోవడం, ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం నిజంగా పాలకుల అసమర్థతే. దానివల్లే ఇప్పుడు ఇన్ని సమస్యలు. e maata maatram 100% nijam. prajalu dobididaarulu kaadu. prajalu athi saamanyulu....vaarini vuddarimche naayakulu valla jarigutunna parinaamam......adikaara vikemdrikarana jarigithe elanti vudyamaalu lenakarledu.....kalisi vunna lekunna, development vumte adi chaalu.............
zimbabwe capital nu... SwitZerland capital nu compare cheyalemu kada.. Andhra Apude Chennai nunchi bayataku vacchindi. At least valla area lo citys dovelop kuda chesukoledu. Ipudu hyderabad lo funds pettinatle.. appudu dabbunnollantha.. Chennai lo petti thagalettaru.. adi capital ani...appudoo mosapoyaru.. ipudooo mosapoyaru.. poor fellows. hyd nu evadoo dovelop cheyaledannadi ikkada intention aite Aa matter direct ga no.. inko vidhamgano cheppocchu.. kani ye comparision photos matter elivate avadani naa Abhiprayam
zimbabwe capital nu... SwitZerland capital nu compare cheyalemu kada.. Andhra Apude Chennai nunchi bayataku vacchindi. At least valla area lo citys dovelop kuda chesukoledu. Ipudu hyderabad lo funds pettinatle.. appudu dabbunnollantha.. Chennai lo petti thagalettaru.. adi capital ani...appudoo mosapoyaru.. ipudooo mosapoyaru.. poor fellows. hyd nu evadoo dovelop cheyaledannadi ikkada intention aite Aa matter direct ga no.. inko vidhamgano cheppocchu.. kani ye comparision photos matter elivate avadani naa Abhiprayam