2, ఆగస్టు 2013, శుక్రవారం
ఉద్యమంలోకి సీమాంధ్ర ఎంపీలు
Categories :
congress . lagadapati . mps resign . POLITICS . protest . seemandhra . telangana . TOP
కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అన్ని రకాల మార్గాలపై అర్థరాత్రి వరకూ చర్చించిన సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు.. చివరకు రాజీనామాల బాటను ఎంచుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎంపీలు లగడపాటి, హర్షకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవల్లి, సాయిప్రతాప్, సబ్బంహరిలు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కు తమ రాజీనామాలను అందించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. అయితే నిన్న రాత్రి భేటీలో పాల్గొన్న నలుగురు కేంద్ర మంత్రులు పల్లంరాజు, జేడీశీలం, పురందేశ్వరి, కిల్లి కృపారాణిలు మాత్రం ఇంకా రాజీనామాలు సమర్పించలేదు. వీరు సమర్పిస్తారా లేదా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు రాయపాటి, ఎస్పీవై రెడ్డిలు రాజీనామలు చేయడంతో, ఎంపీల రాజీనామాల సంఖ్య ఎనిమిదికి చేరింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి