హైదరాబాద్ ను పదేళ్ల పాటే రాజధానిగా ఉంచుతామన్న కాంగ్రెస్ ప్రకటన, రాజధానిలో ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగుల పెద్ద ఆందోళనే రేపింది. రాష్ట్ర విభజన వద్దని ఏపీఎన్జీవోలు ఆందోళన బాట పట్టినప్పటికీ, వారి దృష్టంతా హైదరాబాద్ ను వదులుకోకుండా చూసుకోవడంపైనే ఉంది. రాష్ట్ర విభజన జరిగితే, ఆంధ్రా ఉద్యోగులు అక్కడి ప్రభుత్వానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత నిర్ణయం ప్రకారం వచ్చే పదేళ్లు రాజధాని ఇక్కడే ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. కానీ సమస్యంతా ఆ తర్వాతే మొదలవుతుంది. కొత్త రాజధానికి వెళ్లడం, అక్కడ స్థిర పడడం నిజంగానే పెద్ద సమస్య. అయితే, దానికన్నా పెద్ద సమస్య మరొకటి ఉంది. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా స్థిరపడ్డ ప్రభుత్వోద్యోగుల పిల్లల భవిష్యత్తు గురించే ఇప్పుడు వారి ఆందోళన. సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడ నాన్ లోకల్ అయినా, వారిలో చాలా మందికి పిల్లలు ఇక్కడే పుట్టారు, ఇక్కడే చదువుకున్నారు. ఈ పిల్లలంతా ఇక్కడ లోకల్. కానీ, తాము కొత్త రాష్ట్రానికి తరలిపోతే అక్కడ నాన్ లోకల్ అవుతారన్నది ఉద్యోగుల ఆందోళన. దీనివల్ల వారు ఉద్యోగాలు పొందలేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు ఇప్పుడు ప్రభుత్వం పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది.
6, ఆగస్టు 2013, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి