10, ఆగస్టు 2013, శనివారం
సమైక్య ఉద్యమంలోకి జగన్, విజయమ్మ
Categories :
jagan . POLITICS . samaikya protest . seemandhra . telangana . TOP . vijayamma . ysrcp
వైసీపీ అధ్యక్షుడు జగన్, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీమాంధ్రలో వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాల తర్వాత మౌనంగా ఉన్నవీరిద్దరూ, తమ పార్టీ భవిష్యత్తు సీమాంధ్ర ప్రాంతంలోనే ఉందని గుర్తించి తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సాయంత్రం దీనిపై విజయమ్మ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం పార్టీ కేడర్ దూరం కావడం, సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమంలో వైసీపీ నేతలు చురుగ్గా పాల్గొంటుండడం, జగన్, విజయమ్మలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కావడంతో తమ ప్రాంత మనోభావాలకు అనుగుణంగా ఆవైపే మొగ్గు చూపాలని డిసైడ్ అయ్యారు. వీరిద్దరి రాజీనామాలతో సమైక్య ఉద్యమానికి మరింత ఊపు వచ్చి, మిగిలిన పార్టీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అవును...తెలంగాణలో ఆ పార్టీకి అపజయమ్ము నిశ్చయమ్మురా!!!!విజయమ్మ సీమాంధ్ర ఉద్యమంలోకి దూకినా తెలంగాణా రాష్ట్రం ఆగుతుందనుకోవడం భ్రమాజనితం!అసలు ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణారాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి మరో పార్టీ పెట్టి కొన్ని ప్రదేశాలలో తన పట్టు పెంచుకోవడం!!