సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఐదుగంటలకుపైగా చర్చలు జరిపిన సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూడు తీర్మానాలను కాంగ్రెస్ హైకమాండ్ కు పంపించారు. మొదటిది రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం
రెండోది సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవడం
మూడోది కాంగ్రెస్ జెండాపైనే సమైక్య ఉద్యమాన్ని చేయడం
సీమాంధ్ర ప్రాంత నేతలకు, అక్కడి ఉద్యమ ఒత్తిడికి లోనై ఈ తరహా నిర్ణయాన్ని సీమాంధ్ర నేతలు తీసుకోవడం ఏమాత్రం తప్పుకాదు. అయితే, ఈ తీర్మానంపై సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సంతకాలు చేయడమే ఆలోచించాల్సిన విషయం. సీఎం రాష్ట్రం మొత్తానికి ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన వ్యక్తి, పార్టీ పరంగా రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహించాల్సిన వ్యక్తి పీసీసీ చీఫ్. ముందు వీరిద్దరూ ఎలాంటి వాదన వినిపించినా, అంతిమంగా మాత్రం హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వీరిద్దరూ ప్రకటించారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నాక, పీసీసీ చీఫ్ తాను రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికే ప్రయత్నిస్తానంటూ గాంధీభవన్ సాక్షిగా మీడియా మీట్ లో ప్రకటించారు. ఇప్పుడు, ఏకంగా సీఎం తీర్మానాలపై సంతకం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ వాదాన్ని మాత్రమే బలపరిచడానికి సిద్ధపడినప్పుడు, ఆ వాదానికి అటోమెటిక్ గానే బలం చేకూరుతుంది. తన వాదనా బలం పెంచుకోవడానికి, ఆయన ఉద్యమకారులకూ సహకరించవచ్చు. సీమాంధ్రలో ఉద్యమాల నియంత్రణపై దృష్టి పెద్దగా పెట్టకపోవచ్చు, పైగా సహకరించే అవకాశాలూ ఉన్నాయి. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు.
అందుకే, రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ వాదం వైపు మొగ్గు చూపని వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే, రాష్ట్రంలో శాంతి నెలకొంటుంది. విభజన ప్రక్రియ సజావుగా సాగుతుంది. లేదంటే, నిరంతరం అగ్నిగోళంలా మండుతూనే ఉంటుంది.
4, ఆగస్టు 2013, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నిర్ణయం ఐపోయాక ఏ CM ఉంటె ఏమిటి?