ఉస్మానియా ఆస్పత్రిలో వైఎస్ జగన్ |
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ఉస్మానియా ఆసుపత్రి నుంచి నిమ్స్కు తరలించారు పోలీసులు. ఉస్మానియాలో అత్యాధునిక వైద్య సదుపాయాలు లేకపోవడం, జగన్ కారణంగా పేద రోగులు ఆస్పత్రికి రావడంలో ఇబ్బందులు ఎదుర్కుంటుండడంతో, ఆయన్ను నిమ్స్ కు తరలిస్తే మేలంటూ డాక్టర్ల బృందం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో, అర్థరాత్రి సమయంలో జగన్ ను భారీ భద్రత మధ్య నిమ్స్ కు తరలించారు. విజయమ్మ, భారతి ముందుగా ఉస్మానియాకు వెళ్లినా, జగన్ ను కలవడానికి అనుమతించలేదు పోలీసులు. దీంతో, వారిద్దరూ నిమ్స్ కు చేరుకుని జగన్ రాకకోసం ఎదురు చూశారు. ఆస్పత్రిలో జగన్ తో పాటు ఉండడానికి అనుమతించాలని వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్ ను నిన్న కోర్టు తోసిపుచ్చింది. భారతి వేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.
కామెంట్ను పోస్ట్ చేయండి