26, జులై 2013, శుక్రవారం
ఆ బలగాలు అందుకోసమేనా..?
రాష్ట్ర విభజనపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ, డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ఏర్పడ్డ పరిస్థితులను పునరావృతం కాకూడదని భావిస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో సీడబ్ల్యూసీ సమావేశమయ్యే అవకాశం ఉండడం, ఆగస్టు మొదటి రెండు వారాల్లో విభజనపై ఏదో ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉండడంతో, ముందు జాగ్రత్తగా రాష్ట్రానికి ప్రత్యేక బలగాలను పంపించింది. గతంలోనూ కేంద్ర బలగాలు రాష్ట్రానికి వచ్చినా, ఈ సారి మోహరింపు విషయం మాత్రం విభజనపై కొన్ని స్పష్టమైన సంకేతాలను ఇస్తోంది. గతంలో వచ్చిన బలగాలన్నీ, తెలంగాణ ప్రాంతాల్లోనే ఎక్కువగా మోహరించగా, ఈ సారి మాత్రం 21 కంపెనీల బలగాలు వస్తే, అన్నింటినీ సీమాంధ్రలోని ప్రాంతాల్లోనే మోహరించారు. సీఆర్పీఎఫ్ నుంచి 8, ఆర్పీఎఫ్ నుంచి 8, బీఎస్ఎఫ్ నుంచి మరో 7 కంపెనీలు వచ్చాయి. వీటన్నింటినీ తిరుపతి, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నానికి తరలించారు. ఈ బలగాలను ఆందోళనలు అరికట్టడానికి, శాంతి భద్రతలను పరిరక్షించడానికి మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది కేంద్రం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముందు జాగ్రత్త చర్యగా బలగాలను సమీకరణ ప్రత్యేక తెలంగాణా ప్రకటన నిమిత్తమేనని చెప్పవచ్చు!విషయం తేల్చకుండా ఇంకా తాత్సారం చేయడం కాంగ్రెస్ కు ఆత్మహత్యాసదృశం అవుతుందని గ్రహించడం వలన కావచ్చు!