కోర్ కమిటీ ముందు రాష్ట్రానికి చెందిన త్రిమూర్తులు చెప్పిన అన్ని విషయాల్లోకి అత్యంత కీలకమైన విషయం... హైదరాబాద్ ను హాంకాంగ్ చేయడం. రాష్ట్రాన్ని విభజించవద్దని, తెలంగాణకు ప్రత్యేక రక్షణలు ఇస్తే చాలని వాదించిన సత్తిబాబు... ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో విడదీయాల్సి వస్తే మాత్రం హైదారాబాద్ ను హాంకాంగ్ గా మార్చాలని డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన వివరాలను కూడా ఆయన తన నివేదికలో పేర్కొన్నారు.
చైనా, బ్రిటన్ల మధ్య జరిగిన ఫస్ట్ఓపియమ్వార్లో హాంగ్కాంగ్, తెల్లదొరల పాలనలోకి వెళ్లింది. హాంగ్కాంగ్ స్వాతంత్ర్యం ఇచ్చి చైనాలో కలపాల్సి వచ్చినప్పుడు రెండు దేశాలు ఓ ఒప్పందాన్ని చేసుకున్నాయి. హాంగ్కాంగ్అభివృద్ధిలో చైనా, బ్రిటన్ల భాగస్వామ్యం ఉన్నందున దీన్ని చైనాలో కలపడానికి ముందు 25 ఏళ్ల పాటు స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనే నిబంధన విధించుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ను ఇరు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చేశారు కాబట్టి... దీన్ని కూడా పాతికేళ్ల పాటు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచి ఆ తరువాత తెలంగాణలో విలీనం చేయాలన్నారు బొత్స. హైదరాబాద్ ప్రాంత కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారని కోర్ కమిటీకి నివేదించారాయన.
ఇక రాష్ట్రంలో ప్రత్యేక ఉద్యమం కొంతమంది రాజకీయ నాయకులవల్లే వచ్చిందంటూ కోర్ కమిటీకి నివేదించే ప్రయత్నం చేశారు బొత్స. 57 ఏళ్లుగా వస్తున్న ప్రభుత్వాలు, వాటి అధినేతలు అసలు నిజాలను ప్రజలకు వివరించడంలో విఫలమవ్వడం వల్లే ఈ ఉద్యమం వచ్చిందన్నారాయన. అయితే, తెలంగాణ ప్రాంతానికి అసలు అన్యాయమే జరగలేదని తాను చెప్పడం లేదని, రాష్ట్ర సర్వీసు పరీక్షల్లో ఉద్యోగాలు సీమాంధ్ర ప్రజలకే ఎక్కువగా దక్కుతుండడం, సచివాలయంతో పాటు ప్రభుత్వ శాఖల్లోనూ ఎక్కువ మంది సీమాంధ్రవాళ్లో ఉద్యోగాలు దక్కించుకోవడం, రాజకీయంగానే ఉన్నతపదవులను సీమాంధ్ర నేతలే అనుభవిస్తుడడం వల్లే, తెలంగాణలో ఆత్మగౌరవ పోరాటం మొదలయ్యిందన్నారాయన. ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం లేదని, తెలంగాణకు రాజ్యాంగ రక్షణతో కూడిన అభివృద్ధఇ మండలిని ఏర్పాటు చేయడం, తెలంగాణకు ప్రత్యేకంగా సర్వీస్ కమిషన్ ను ఏర్పాటు చేయడం లాంటి చర్యలు చేపడితే, అక్కడి ప్రజలను సంతృప్తి పరచవచ్చని సూచించారు. అలా కాదని రాష్ట్రాన్ని విభజిస్తే మాత్రం సాగునీటి సమస్య, విద్యుత్ సమస్య పెద్ద తలనొప్పిగా మారతాయని వివరించారు. పైగా సీమాంధ్ర ప్రాంతంలో రాజధానిని నిర్మించాల్సి వస్తుందని, దీనికి వేల కోట్ల ఖర్చవుతుందని, దీన్ని కేంద్రం భరించలేదంటూ చెప్పుకొచ్చారు. చివరకు తాను సమైక్యవాదినే అంటూ, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమనంటూ ముక్తాయించారు.
21, జులై 2013, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి