1, జులై 2013, సోమవారం
కాంగ్రెస్ లో కలకలం రేపిన డిగ్గీరాజా
Categories :
congress . digvijaysingh . POLITICS . telangana . TOP
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన దిగ్విజయ్ సింగ్, వస్తూ వస్తూనే పెద్ద బాంబ్ పేల్చారు. గాంధీ భవన్లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న డిగ్గీ రాజా, ఎవరూ అడగకముందే తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. వారం పది రోజుల్లో రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమవుతుందన్నారాయన. ఈ సమావేశానికి సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలను ఆహ్వానిస్తామని, తనతో పాటు రాహుల్ గాంధీ, ఆజాద్ కూడా ఆ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు దిగ్విజయ్. ఈ భేటీలోనే ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారాయన. రాష్ట్ర విభజన బాధాకరమే అంటూనే, హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి ఇరు ప్రాంతాల నేతలూ కట్టుబడి ఉండాలని సూచించారు దిగ్విజయ్ సింగ్. ఆయన చెప్పిన మాటలపై అటు సీఎం కిరణ్ గానీ, పీసీసీ చీఫ్ బొత్స గానీ, డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ గానీ ఎవరూ మాట్లాడలేదని సమాచారం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి