11, జూన్ 2013, మంగళవారం
మేస్త్రీకి మసి అంటుకుంది
ఎప్పుడూ తెల్ల బట్టలతో నిగనిగలాడుతూ, ఇండస్ట్రీలోని కొంతమందికి తరచూ నీతులు చెబుతూ ఉండే దర్శకరత్న దాసరికి టైడ్ తో ఉతికినా పోలేనంత బొగ్గు మసి అంటుకొంది. బొగ్గు గనుల కేటాయింపులో భాగంగా దాసరి క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎప్పటినుంచో ఉన్నాయి. జిందాల్ కంపెనీకి గనులు కేటాయించడం, దాసరికి చెందిన సౌభాగ్య మీడియాలో జిందాల్ కంపెనీల నుంచి పెట్టుబడులు రావడం ఏకకాలంలో జరిగాయి. కోల్ స్కామ్ పై దర్యాప్తు చేస్తున్న సీబీఐ దీన్ని గుర్తించింది. తాజాగా ఢిల్లీలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో జిందాల్ అధినేత, కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ తో పాటు, దాసరి నారాయణ పేరును సీబీఐ నమోదు చేసింది. అదే సమయంలో హైదరాబాద్ లోని దాసరి ఇంట్లోను, కార్యాలయంలోనూ పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. దాసరికి చెందిన కార్లను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే, ఈ సోదాలపై మాట్లాడటానికి మాత్రం సీబీఐ అధికారులు నిరాకరించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి