డాలర్ తో రూపాయి మారకం విలువ పెరిగిపోతుండడం, ఇంధన ధరలు మండిపోతుండడంతో ఖర్చు తగ్గించుకోవడానికి చౌక ధరల విమానయాన సంస్థ గోఎయిర్ సరికొత్త ప్లాన్ వేసింది. ఇకపై కేవలం ఆడవాళ్లను మాత్రమే సిబ్బందిగా ఎంపిక చేయాలని నిర్ణయించింది. మగాళ్ల వల్ల ఇంధనం వృథా ఎక్కువ అవుతుందని, అదే ఆడవాళ్ల వల్ల ఆదా అవుతుందని గోఎయిర్ చెబుతుంది. దీనికో లెక్క కూడా ఉందంటోంది గోఎయిర్.
గో ఎయిర్ కు ప్రస్తుతం 330 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. వీరిలో దాదాపు 40 శాతం అంటే 130 మంది వరకూ మగవాళ్లే. ఆడాళ్లతో పోల్చితే మగాళ్ల బరువు చాలా ఎక్కువ. సగటున చూస్తే ఆడవాళ్లకు, మగవాళ్లకు మధ్య 15 నుంచి 20 కేజీల బరువు తేడా ఉంటోందంట. విమానం ప్రయాణించేటప్పుడు ప్రతీ అదనపు కిలోకూ గంటలు మూడు రూపాయల ఖర్చవుతుంది. మగాళ్ల స్థానంలో పూర్తిగా ఆడవాళ్లనే తీసుకుంటే ఏడాదికి రెండున్నర నుంచి మూడు కోట్లు ఆదా అవుతుందని లెక్కేసింది గోఎయిర్ యాజమాన్యం. అంతేకాదు, విమానాల్లో ఉండే వాటర్ ట్యాంక్ ను కూడా 60 శాతం మాత్రమే నింపుతోంది. దీనివల్ల కూడా ఇంధనం ఆదా అవుతుందట.
వచ్చే ఏడేళ్లలో మరో 80 విమానాలను కొనాలనుకొంటోంది గోఎయిర్. వీటి కోసం దాదాపు 2 వేల మందిని నియమించుకోనుంది. వీరందరినీ కూడా మహిళలనే ఎంపిక చేయాలని భావిస్తుంది. ఇప్పటివరకూ మహిళలను ఎక్కువగా ఎయిర్ హోస్టెస్ లుగానే ఉపయోగించుకుంటుండగా, ఇకపై పైలెట్లు, క్యాబిన్ సిబ్బందిగా కూడా పూర్తిగా మహిళలనే నియమించాలని నిర్ణయించింది గో ఎయిర్. అ
గో ఎయిర్ తీరు చూస్తుంటే త్వరలోనే మగాళ్లకో టికెట్ రేటు, ఆడాళ్లకో టికెట్ రేటు, బరువును బట్టి టికెట్ ను వసూలు చేసినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.
28, జూన్ 2013, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి