బ్రిటన్ సింహాసన వారసత్వంలో రెండో వరసలో ఉన్న ప్రిన్స్ విలియం కు సంబంధించిన ఆసక్తికరమైన విషయం తాజాగా బయటపడింది. త్వరలోనే ఓ బిడ్డకు తండ్రి కాబోతున్న విలియం మూలాలు భారత్ లో ఉన్నట్లు తేలింది. ఆయన డీఎన్ఏ లో భారతదేశానికి చెందిన ఓ మహిళ డీఎన్ఏ ఉండడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని సృష్టిస్తోంది. ఈ డీఎన్ఏ అతని తల్లి డయానా ద్వారా అందడం విశేషం.
ప్రిన్స్ విలియంకు భారత మహిళకు చెందిన డీఎన్ఏ ఎలా వచ్చిందన్నదానిపై ఆసక్తికరమైన చరిత్రే ఉంది. ప్రిన్స్ విలియం ముత్తాతైన థియోడర్ ఫోర్బ్స్ (1788-1820) ఈస్ట్ ఇండియా కంపెనీలో వ్యాపారిగా పనిచేసేవాడు. వ్యాపారం నిమిత్తం ఈయన సూరత్ లో ఉండేవాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ సమయంలో ఆయన ఇంట్లో ఎలిజా కెవార్క్ అనే మహిళ పనిచేసేది. ఫోర్బ్స్ కు, ఎలిజాకు పుట్టిన సంతానమే కేథరిన్. కొన్నాళ్లకు ఎలిజాను వదలిపెట్టి కేథరిన్ ను తీసుకొని ఫోర్బ్స్ బ్రిటన్ వెళ్లిపోయాడు. కేథరిన్ వంశంలోని ఐదో తరంలో జన్మించిందే విలయం తల్లి డయానా. ఎలిజా నుంచి కేథరిన్ శరీరంలో చేరిన డీఎన్ఏ తరతరాలుగా సాగుతూ డయానా ద్వారా.. విలియం ఒంట్లోకీ చేరింది. డయానా బంధువుల నుంచి సేకరించిన డీఎన్ఏ పై పరిశోధనలు చేసిన బ్రిటన్ సైంటిస్టులు ఈ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం విలియం ఒంట్లో ఉన్న డీఎన్ఏ పేరు ఎంటీడీఎన్ఏ, ఇది అత్యంత అరుదైన డీఎన్ఏ అంటున్నారు సైటింస్టులు. డయానా ఫ్యామిలీని వదిలిపెడితే, ఇంతవరకూ ఇది 13 మంది భారతీయులు, ఓ నేపాలీలో మాత్రమే గుర్తించారట. అయితే, ఇది ఆడవాళ్ల నుంచి వారి సంతానానికి మాత్రమే వెళ్లే డీఎన్ఏ. దీంతో విలియంకు పుట్టబోయే బిడ్డలో ఈ డీఎన్ఏ ఉండే అవకాశం ఉండదు.
అయితే, ప్రిన్స్ విలియం గనక బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టిస్తే, భారతీయ మూలాలు ఉన్న తొలి వ్యక్తి ఆ సింహాసనంపై కూర్చున్నట్లవుతుంది. అన్నట్లు త్వరలోనే భారత్ లో పర్యటించడానికి కూడా ఉత్సాహంగా ఉన్నాడట ప్రిన్స్ విలయం.
14, జూన్ 2013, శుక్రవారం
బ్రిటన్ యువరాజు మూలాలు మనవేనట..!
Categories :
Briton . indian origin . news . prince William . TOP . UK
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి