బీజేపీ కురువృద్ధుడు అద్వానీ సృష్టించిన సంక్షోభం టీకప్పులో తుపానులా సద్దుమణిగిపోయింది. రాజీనామా లేఖను సంధించి, రెండురోజుల పాటు బీజేపీ నేతలకు కంటిమీద నిద్ర లేకుండా చేసిన అద్వానీ.. చివరకు ఆరెస్సెస్ జోక్యంతో మనసు మార్చుకున్నారు.
మంగళవారం ఉదయం నుంచి గడ్కరీ నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం పలు దఫాలు అద్వానీతో మాట్లాడింది. అయితే, వీళ్లు చెప్పింది వినడమే తప్ప ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మధ్యాహ్నం వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. మరోవైపు అద్వానీ వర్గమైన సుష్మస్వరాజ్, ఉమాభారతిలు ప్రత్యేకంగా సమావేశమైన చర్చలు జరిపారు. అనంతరం ఉమాభారతి అద్వానీ నివాసానికి చేరుకుని ఆయనతో మాట్లాడారు. బీజేపీలో నెలకొన్న సంక్షోభంపై స్పందించిన ఆర్ఎస్సెస్ నేతలు అద్వానీతో మాట్లాడారు. సంఘ్ చీఫ్ మోహన్ భగత్ .. రాజీనామాను ఉపసంహరించుకోవాలని సూచించారు. దీంతో కాస్తమెత్తబడ్డారు అద్వానీ. అనంతరం రాజ్ నాథ్, సుష్మాస్వరాజ్ లు వెళ్లి అద్వానీతో చర్చలు జరిపారు. పార్టీలో ఆయన లేవనెత్తిన అంశాలపై దృష్టి పెడతామని, అద్వానీ కోరుకున్నట్లే పార్టీని నడిపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో, రాజీనామా ఉపసంహరించుకోవడానికి అంగీకరించారు అద్వానీ. అయితే.. ఈ విషయాన్ని మీడియా ముందుకు వచ్చి ప్రకటించడానికి మాత్రం ఆయన అంగీకరించలేదు. దీంతో, రాజ్ నాథ్, గడ్కరీ, సుష్మాస్వరాజ్ లు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, అసలు విషయాన్ని మాత్రమే చెప్పి ముగించారు. రిపోర్టర్లు ప్రశ్నలు వేసినా స్పందించకుండా వెళ్లిపోయారు. దీంతో, అద్వానీ అసంతృప్తి పూర్తిస్థాయిలో సద్దుమణగలేదన్న విషయం అర్థమవుతుంది.
11, జూన్ 2013, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి