5, ఏప్రిల్ 2013, శుక్రవారం
చిరంజీవి లెటర్ ను విసిరి కొట్టిన సీఎం
Categories :
chiranjeevi . cm kiran . congress . differences . POLITICS . TOP
మెగాస్టార్ చిరంజీవికి, సీఎం కిరణ్ కు మధ్య విబేధాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపుపై తనను పదే పదే బహిరంగంగా విమర్శించడాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నారు. ఈ వారాంతంలో ఢిల్లీ వెళ్లనున్న సీఎం, అధిష్టానానికి చిరంజీవిపై ఫిర్యాదు చేయబోతున్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, సమన్వయ కమిటీలో చర్చించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ బహిరంగంగానే అడిగిన చిరంజీవి ఈ మేరకు సీఎంకు ఓ లేఖ రాశారు. దీన్ని మౌలికసదుపాయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సీఎంకు పంపించారు. అయితే, ఈ లెటర్ ఇవ్వగానే తీవ్రంగా మండిపడ్డ సీఎం, దాన్ని విసిరి పడేశారట. దీంతో, వీరిద్దరిమధ్యా అగాధం మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. దీని ప్రభావం రాబోయే రోజుల్లో పార్టీపై పడొచ్చన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి