ఖర్చు తక్కువవ్వాలి.... ప్రచారం మాత్రం ఫుల్ గా రావాలి. ఇదే ఇప్పుడు సీఎం కిరణ్ స్ట్రాటజీలా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు తన ప్రభుత్వంపై పెద్దగా భారం పడకుండానే, అమోఘమైన క్రెడిట్ ను కిరణ్ సొంతం చేసుకోబోతున్నారు. తాజా ప్రకటించిన బంగారుతల్లి పథకం కింద ఆడపిల్ల పుడితే వెంటనే రూ.2500 ఇస్తామని ప్రకటించారు సీఎం. ఒకటో తరగతిలో చేరినప్పటి నుంచి ప్రతీ కొంతమొత్తం ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ లెక్కన డిగ్రీ అయ్యేనాటికి ఒక్కో అమ్మాయికి 22 వేల రూపాయలు అందిస్తామని ఘనంగా ప్రకటించారు సీఎం. అయితే, ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలకు ఈ పథకం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. మే 1 తర్వాత పుట్టే పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. సగటున తీసుకుంటే, ఏటా దాదాపు ఏడు లక్షల మంది అమ్మాయిలు జన్మించే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వం మరో ఏడాది కాలమే అధికారంలో ఉంటుంది కాబట్టి, కిరణ్ సర్కార్ పై పడే బడ్జెట్ భారం 175 కోట్లు మాత్రమే. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలే ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది.
2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఆరేళ్ల లోపున్న అమ్మాయిల సంఖ్య 41, 94,356..
2001 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఆరేళ్లలోపు ఉన్న అమ్మాయిల సంఖ్య 4984536. అంటే పదేళ్లలో ఆరేళ్ల లోపు ఉన్న బాలికల సంఖ్య 790180 తగ్గిపోయింది. దాదాపు ఇది 16 శాతానికి సమానం. వచ్చే దశాబ్దిలో ఇది మరింత తగ్గనుంది. ఈ లెక్కన చూస్తే, ప్రభుత్వంపై పడే మరింత తగ్గొచ్చు. తర్వాత వచ్చే ప్రభుత్వాలు కానీ, ముఖ్యమంత్రులు గానీ ఈ పథకాన్ని ఎంతవరకూ కొనసాగిస్తారన్నది అనుమానమే. కేవలం 175 కోట్ల ఖర్చుతో, అమ్మాయిలకు ఆపద్భాందవుడిగా లైఫ్ లాంగ్ పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకోనున్నారు సీఎం కిరణ్.
29, ఏప్రిల్ 2013, సోమవారం
వాట్ యాన్ ఐడియా సీఎం జీ..!
Categories :
bangaru talli . cm kiran . congress . new scheme . POLITICS . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి