18, ఏప్రిల్ 2013, గురువారం
టీ కాంగ్ ఎంపీలను పట్టించుకోని హైకమాండ్
టీఆర్ఎస్లో చేరేందుకు టీ కాంగ్రెస్ ఎంపీలు రెడీ అవుతున్నా... ఆపే ప్రయత్నాలు హైకమాండ్ వైపు నుంచి జరగడంలేదు. ఐదుగురు ఎంపీలు మారతారని తెలిసినా హైకమాండ్ ఏమాత్రం టెన్షన్ పడడం లేదు. కనీసం ఒక్క ఎంపీకైనా ఫోన్ చేసి మాట్లాడిన దాఖలాలు లేవు. పీసీసీ చీఫ్ హోదాలో బొత సత్యనారాయణ జానారెడ్డి, కేకేతో మాట్లాడటం మినహా ఎంపీలతో మాట్లాడిన వారు లేరు. ఎంపీలు పార్టీ వదలడానికి సిద్ధమయ్యారని తెలిసినా, హైకమాండ్ ఎందుకు పట్టించుకోవడంలేదన్నది ఎవరికీ అంతుబట్టడంలేదు. కావూరి సాంబశివరావు రాజీనామా చేస్తే ప్రధాని మన్మోహన్ మొదలు పార్టీలోని సీనియర్లు అందరూ రంగంలోకి దిగి ఆయన్ను బుజ్జగించారు.అయితే ఏకంగా అయిదుగురు ఎంపీలు పార్టీకి గుడ్బై చెప్పబోతున్నారని తెలిసినా... హైకమాండ్ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటం విశేషం. ఎంపీల వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ఆజాద్ వద్ద ప్రస్తావిస్తే... పెద్దగా సీరియస్గా తీసుకోకపోగా... ఈ నెల 22 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మాట్లాడతానని చెప్పారు. దీన్ని బట్టి హైకమాండ్ దగ్గర టీకాంగ్ ఎంపీలకున్న వాల్యూ ఏమిటో అర్థమవుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి