బియ్యం ధరలను చుక్కలంటున్నాయి. మేలురకం సన్నబియ్యం అయితే కిలో 40 రూపాయల పైమాటే. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో అయితే.. ఏకంగా 50 రూపాయలను తాకింది సన్నబియ్యం. పేద మధ్య తరగతి ప్రజలు సన్నబియ్యం కొనుక్కునే పరిస్థితి లేకపోవడంతో, సరికొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చారు తమిళనాడు సీఎం జయలలిత. ఈ పథకం స్టేట్లో ఆమెకు మరింత పాపులారిటీని తెచ్చిపెట్టింది.
బియ్యం ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడానికి తమిళనాడు సీఎం జయలలతి సరికొత్త సంక్షేమ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. కేవలం ఇరవై రూపాయలకే కిలో సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ పథకం కింద సన్నబియ్యాన్ని పొందవచ్చన్నారు సీఎం జయలలిత.
బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలకు కళ్లెం వేయడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని జయలలిత భావిస్తున్నారు. ఐదు కేజీలు, పదికేజీల బ్యాగుల్లో వీటిని కొనుగోలుదారులకు అందించనున్నారు. ప్రభుత్వానికి చెందిన అముదం స్టోర్లు, కో-ఆపరేటివ్ స్టోర్లు, ప్రత్యేక ఔట్లెట్ల ద్వారా అమ్మనున్నారు. దీనికోసం తమిళనాడు మార్కెటింగ్ శాఖ ఇప్పటికే లక్ష టన్నుల బియ్యాన్ని సేకరించింది.
బడ్జెట్ సమావేశాల్లో ఇచ్చిన హామీ మేరకు జయలలిత ఈ కొత్త స్కీమ్ను అమల్లోకి తెచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలను, కొన్న ధరకే ప్రజలకు అందించడం కోసం వందకోట్ల రూపాయలతో ప్రైస్ స్టెబులైజేషన్ ఫండ్ను కూడా జయలలిత ఏర్పాటు చేశారు. కేవలం 20 రూపాయలకే కిలో సన్నబియ్యం అందించడంపై తమిళులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
18, ఏప్రిల్ 2013, గురువారం
అక్కడ సన్నబియ్యం కిలో రూ.20
Categories :
jayalalitha . news . Rs. 20 kg rice . tamilnadu . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి