19, మార్చి 2013, మంగళవారం
అత్యాచార నిరోధంపై మనోళ్ల చిత్తశుద్ధి అంతే..!
Categories :
anti rape bill . bjp . POLITICS . TOP . upa
అత్యాచార నిరోధక చట్టం ఎట్టకేలకు పార్లమెంట్ ఆమోదం పొందింది. అయితే, కఠినమైన నిబంధనలను చేర్చాలన్న విపక్షాల తీర్మానాలు మాత్రం వీగిపోయాయి. మహిళలు వేధించేవారికి బెయిల్ ఇవ్వకుండా చట్టంలో మార్పు తేవాలన్న బీజేపీ సవరణతో పాటు, యాసిడ్ దాడులకు పాల్పడేవారికి జీవిత ఖైదు విధించాలన్న సవరణ తీర్మానం కూడా వీగిపోయింది. యాసిడ్ దాడులకు ఒడిగట్టే వారికి పదేళ్ల వరకే జైలు శిక్ష కు ప్రస్తుత చట్టం అంగీకరిస్తుంది. బహుశా యాసిడ్ దాడి ఎంత దారుణంగా ఉంటుందో ప్రభుత్వానికి తెలియలేదనుకుంటా..
ఇక కీలకమైన ఈ బిల్లు పార్లమెంట్ లో చర్చ జరుగుతున్న సమయంలో సభ్యులు, కీలకమైన నేతలు సభలో లేకుండా పోయారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, భావి ప్రధానిగా కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకొంటున్న రాహుల్ గాంధీ, సీనియర్ మంత్రులు సభకు గైర్హాజరయ్యారు. ఇక జేడీయూ నేత చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురిచేశాయి. మనలో అమ్మాయిలను ఫాలో అవ్వని వాళ్లు ఎవరన్నా ఉన్నారా అంటూ ప్రశ్నించారాయన. మహిళల వెంటపడడం, మాటలతో వేధించడాన్ని నేరంగా చూడడం వల్ల, మగాళ్లపై అక్రమ కేసులు ఎక్కువవుతాయంటూ లోక్ సభలో తన వాదన వినిపించారు.
అత్యంత క్రూరంగా అత్యాచారం చేసేవాళ్లకు మరణ శిక్ష, సాధారణ అత్యాచారాలకు 20 ఏళ్ల వరకూ జైలు శిక్షను ఈ చట్టం ప్రతిపాదిస్తోంది. యాసిడ్ దాడులు, మహిళల వెంటపడడం, ఇతరుల శృంగార కార్యకలాపాలు చూసి ఆనందించడం (బ్లూఫిల్మ్స్ చూడడం) లాంటివన్నీ కొత్త చట్టం కింద నేరాలుగా పరిగణిస్తారు. ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ ఓ మహిళా అధికారిని ఈ చట్టం కింద నియమించే అవకాశం ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి