14, మార్చి 2013, గురువారం
బాబు గారూ మీ ఆస్తులు అమ్ముకుంటారా మరి!
Categories :
chandrababu . padayatra . POLITICS . tdp . TOP
టీడీపీ కార్యకర్తలకు ఇది ఎమర్జెన్సీ కాలమని, ఆస్తులు అమ్మైనా పార్టీని గెలిపించుకోవాలని అన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేసిన ఆయన, భీమవరం, ఉండి నియోజకవర్గాల సమావేశం నిర్వహించారు. నిద్రలో కూడా పార్టీ గురించే ఆలోచించాలని, పార్టీకి పూర్వ వైభవం తేవాలని అన్నారు. అంతా బాగానే ఉన్నా, కార్యకర్తలను ఆస్తులు అమ్ముకోమని బాబు కోరడమే విచిత్రంగా ఉంది. దేశంలోనే ఆస్తులను ప్రతీఏటా ప్రకటిస్తున్న రాజకీయ నేతల్లో తానే మొదటివాడినని ఘనంగా చెప్పుకునే బాబుగారు, పార్టీ కోసం ఆ ఆస్తులను అమ్ముకుంటారా..? మీ వంది మాగధుల ఆస్తులు అమ్ముతారా..? లేక జనం ఆస్తులు అమ్మించి, అధికారాన్ని సంపాదించుకుని అనుభవిస్తారా..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి