1, ఫిబ్రవరి 2013, శుక్రవారం
శరద్ పవార్ కామెంట్లు తెలంగాణకు లాభమా..? నష్టమా..?
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలంగాణను త్వరగా ఇచ్చేయాలని వార్తలు వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ వాదులు కొండంత అండ లభించినట్లు ఫీలవుతున్నారు. యూపీఏలో ఉన్న పార్టీల్లో ప్రధాన పార్టీ ఎన్సీపీ మద్దతు వచ్చేసింది కాబట్టి, ఇక రాష్ట్ర విభజన ఖాయమని చాలామంది భావిస్తుండవచ్చు. అయితే, శరద్ పవార్ వ్యాఖ్యలు నిజంగానే తెలంగాణను సాకారం చేస్తాయా..? లేక అడ్డం పడతాయా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది.
తెలంగాణపై ప్రధానితో మాట్లాడానన్న విషయాన్ని మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ తెలిపారు శరద్ పవార్. అయితే, దీనిపై అధికారిక ప్రకటనను మాత్రం ఎన్సీపీ అధికార ప్రతినిధి త్రిపాఠీ చేశారు. తెలంగాణకు తమ పార్టీ పూర్తి మద్దతు పలుకుతుందని, అలాగే, మహారాష్ట్రలో విదర్భను కూడా ఏర్పాటు చేయాలని, గూర్ఖాల్యాండ్ కూ తమ సపోర్ట్ ఉంటుందని ప్రకటించారు. ఈ లెక్కన చూస్తే, తెలంగాణ ఇచ్చేస్తే, విదర్భ కూడా ఇవ్వాలన్నది పవార్ ఉద్దేశం కావచ్చు. పైగా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి గెలుస్తుందో లేదో తెలియని పరిస్థితి. విదర్భకు మద్దతు పలకడం ద్వారా, ఆ ప్రాంతం సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునే అవకాశం ఎన్సీపీకి ఉంటుంది. అదే సమయంలో ఎలాగూ తెలంగాణ ఇస్తున్నారు కాబట్టి, విదర్భ కూడా ఇవ్వడంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచొచ్చు. దేశంలో తెలంగాణ సమస్య వేరని, ఇతర ప్రాంతాల్లో సమస్యలు వేరని ఇంతవరకూ తెలంగాణ వాదులు వాదిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఇస్తే, మిగిలిన రాష్ట్రాల్లో విభజన ఉద్యమాలు ఉధృతమవుతుందనేది వాస్తవం కాదంటున్నారు. కానీ, ఎన్సీపీ విదర్భను కూడా ఇవ్వమంటోంది కాబట్టి, తెలంగాణ ఇస్తే, తేనెతుట్టెను కదిపినట్లే అవుతుందని సీమాంధ్ర నేతలు హైకమాండ్ దగ్గర పైరవీ చేయొచ్చు. తెలంగాణను అడ్డుకోవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి