22, ఫిబ్రవరి 2013, శుక్రవారం
రాజధానిలో ఇంకెన్నాళ్లు రక్తం చిందాలి..?
Categories :
dilsuknagar blast . hyderabad blasts . news . terrorist . TOP . twin blasts
దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల ఘటన.. హైదరాబాద్ను మరోసారి ఉలిక్కి పడేలా చేసింది. బాంబ్ బ్లాస్టులు రాజధాని నగరానిక కొత్తేంకాదు. లష్కరే తొయిబా, ఇండియన్ ముజాయిద్దీన్ లాంటి ఉగ్రవాద సంస్థలు తమ ఉనికిని చూపాలకున్న సందర్భాల్లో చాలాసార్లు హైదరాబాద్పై తెగబడ్డాయి. నెత్తురు చిందించాయి.. ఇప్పటివరకు హైదరాబాద్లో జరిగిన పేలుళ్లను ఒక్కసారి చూద్దాం
2002 నవంబర్ 21
దిల్సుఖ్నగర్లోని సాయిబాబా ఆలయం వద్ద ఉగ్రవాదులు బాంబులు పేల్చారు . ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు.
2004
ఈ ఏడాది మూడుసార్లు బాంబు పేలుళ్ల జరిగాయి. నవంబర్ 1న సరూర్ నగర్ దగ్గర పార్క్ చేసిన ఓ ఇంజినీరింగ్ కాలేజ్ బస్సు కింద బాబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ప్రాణనష్టం ఏమి జరుగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మూడు రోజులకే అంటే నవంబర్ 4న పోలీస్ కంట్రోల్ రూం సమీపంలోనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ పాదాచారి గాయపడ్డారు. 2004 నవంబర్ 12 జామై ఉస్మానియా రైల్వేస్టేషన్ సమీపంలో ప్రైవేటు బస్సులో పేలుడు జరిగింది.
2005
ఈ ఏడాది కూడా రెండుసార్లు నగరంలో పేలుళ్లు జరిగాయి. ఏప్రిల్ 14న నక్లెస్ రోడ్డు సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన బాంబు పేలుడు జరిగింది. అనంతరం సరిగ్గా ఆరునెలలకు అంటే ఆక్టోబర్ 12వ తేదీన బేగంపేటలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో హోం గార్డు మరణించాడు. కానిస్టేబుల్ ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు.
2006
ఈ ఏడాది రెండుసార్లు పేలుళ్లు జరిగాయి. మే 7న నగరంలోని ఒడియన్ థియేటర్లో బాంబు పేలుళ్లు సంభవించి ఓ యువతితో సహా ముగ్గురు గాయపడ్డారు. అదే నెల 11న బంజారాహిల్స్ సమీపంలో ఇందిరా నగర్లో ఇంట్లో చెత్త సామాన్లు తొలగిస్తుండగా బాక్స్లోని బాంబు పేలింది. మరో బాంబును పోలీస్లు నిర్వీర్యం చేశారు.
2007
మూడుసార్లు ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. మే 1న మలక్ పేటలో లెటర్ పార్శిల్ బాంబు పేలుడు జరిగి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. మే 18న పాతబస్తీ మక్కా మసీదులో బాంబులు పేలి 14 మంది మృత్యవాత పడ్డారు. మరో మూడు బాంబులను నిర్వీర్యం చేశారు పోలీసులు. ఆగస్ట్ 25న లుంబినీ పార్క్ , కోఠిలోని గోకుల్ ఛాట్లో సంబంవించిన పేలుళ్లలో 42 మంది మరణించారు. దిల్సుఖ్నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద పెట్టిన మరో బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు.
2013
ఫిబ్రవరి 21న దిల్ సుఖ్ నగర్లో జంట పేలుళ్లు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి