21, ఫిబ్రవరి 2013, గురువారం
తిరుమల వెంకన్నతో వ్యాపారమా..?
సామాన్య భక్తుల సౌకర్యాలను ఏమాత్రం పట్టించుకోకుండా, వీఐపీల సేవలో తరించే తిరుమల తిరుపతి దేవస్థానం కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడితోనే ఇప్పుడు వ్యాపారం మొదలుపెట్టింది. వెంకన్న రూపం, ఆనందనిలయ గోపురాన్ని వాచ్చీల్లో వాడుకొని అమ్ముకోవచ్చంటూ.. స్విట్జర్లాండ్ కు చెందిన సెంచురీ వాచెస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారల అవసరాల కోసం స్వామిని వాడుకోవాలనుకోవడంపై హిందూ సంస్థలు మండిపడుతున్నాయి.దీన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి