21, ఫిబ్రవరి 2013, గురువారం
కోహినూర్ ఇచ్చే ప్రసక్తే లేదట..!
భారత ఆశలపై నీళ్లు చల్లారు బ్రిటన్ ప్రధాని కేమరాన్. మన గోల్కొండ సంస్థానానికి చెందిన, ప్రపంచంలోనే అతివిలువైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. ఎన్నో చేతులు మారుతూ వచ్చిన కోహినూర్ వజ్రాన్ని, 1850లో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ స్వాధీనం చేసుకుని , బ్రిటీష్ రాణికి బహూకరించారు. ప్రస్తుత రాణి ఎలిజబెత్ తల్లి క్వీన్ విక్టోరియాకు 105 కేరట్ల ఈ కోహినూర్ ను తన కిరీటంలో అలంకరించుకున్నారు. అప్పటినుంచి అక్కడే ఉంది ఆ కోహినూర్ డైమండ్. మన వారసత్వ సంపదగా భావించే ఈ డైమండ్ ను మనకే ఇవ్వాలంటూ చాలాకాలంగా ఎంతోమంది డిమాండ్ చేస్తున్నారు. అయితే, గ్రీక్ కు చెందిన ఎల్గిన్ మార్బుల్స్ విషయంలోనూ ఇలాంటి డిమాండే ఉందని ప్రస్తావించిన బ్రిటన్ ప్రధాని, కోహినూర్ తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేశారు. ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న దీన్ని అలాగే ఉంచుతామన్నారాయన.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి