3, ఫిబ్రవరి 2013, ఆదివారం
దేవినేని నెహ్రూ కుటుంబం చీలిపోయిందా..?
Categories :
bezawada . devineni nehru . POLITICS . tdp . TOP . vijayawada
బెజవాడ రాజకీయాల్లో కీలకపాత్రధాని దేవినేని నెహ్రూ. ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోయినా, చాలావిషయాల్లో ఆయన, ఆయనవర్గం ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. గుణదలలో నెహ్రూను ఎదిరించే సాహసం ఎవరూ చేయలేరన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎన్టీఆర్ పై అభిమానంతో టీడీపీ ఉండి, చంద్రబాబు కుట్ర సమయంలో పార్టీని వదిలిన నెహ్రూ చాలాకాలంగా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. చంద్రబాబు పేరెత్తితేనే నెహ్రూ ఒంటికాలిపై లేస్తుంటారు. నెహ్రూ తెరపై ఉంటే.. తెరవెనుక అంతా చక్కబెట్టేది ఆయన సోదరుడు బాజీ ప్రసాద్. నెహ్రూ తనయుడు అవినాష్ కొంతకాలం క్రితమే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. కాంగ్రెస్ యువజననాయకుడిగా చెలామణీ అవుతున్నాడు. అయితే, ఈ సమయంలోనే నెహ్రూ సోదరుడు బాజీప్రసాద్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు మాత్రం, తెలుగుదేశంలోకి అడుగు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ప్రస్తుతం విజయవాడలో చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తుండడంతో, ఆయన సమక్షంలోనే పార్టీ తీర్థం పుచ్చుకోవాలని చందు భావిస్తున్నట్లు సమాచారం. రేపు ఐదువేల బైక్ లతో తరలివచ్చి టీడీపీలో చేరే అవకాశం ఉంది. అయితే, నెహ్రూ కుటుంబం నుంచి ఓ కుర్రాడు, టీడీపీలో చేరుతుండడం బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా నెహ్రూకు తెలియకుండా జరుగుతోందా..? లేక రాజకీయంగా ఎదగడం కోసం బాజీ ప్రసాద్, నెహ్రూతో విభేదించి టీడీపీ వైపు వస్తున్నారా..? అదీ కాదంటే.. రెండు పార్టీల్లోనూ ఉంటే మంచిదన్న వ్యూహంతో నెహ్రూనే కావాలనే చేయిస్తున్నారా అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. కానీ, బాజీ కొడుకు టీడీపీలో చేరితే మాత్రం గుణదల రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారతాయి.. పూణేలో పొలిటికల్ గవర్నెన్స్ లో పీజీ చేసిన చంద్రశేఖర్ కు వచ్చే ఎన్నికల్లో పెనమలూరు టికెట్ ఇవ్వడానికి బాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి